New Delhi: చిల్లర లేదన్నందుకు డెలివరీ ఏజెంట్స్‌పై కస్టమర్స్ దాడి.. పోలీస్ కేసు నమోదు

రాజౌరి గార్డెన్ పరిధిలోని తరుణ్ సూరి అనే కస్టమర్ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. దీనికి రూ.1,655 బిల్ అయింది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత కస్టమర్‌కు తిరిగి ఇవ్వడానికి సరిపడా చిల్లర అమన్, గుర్పాల్ సింగ్ వద్ద లేదు. దీంతో చిల్లర లేదనే కారణంతో డెలివరీ ఏజెంట్స్‌తో తరుణ్ అనుచితంగా ప్రవర్తించాడు.

New Delhi: తగిన చిల్లర లేదనే కారణంతో డెలివరీ ఏజెంట్స్‌పై కస్టమర్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్లింకిట్ అనే గ్రాసరీ డెలివరీ సంస్థలో అమన్, గుర్పాల్ సింగ్ డెలివరీ ఏజెంట్స్‌గా పని చేస్తున్నారు.

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు… పలు చోట్ల వడగళ్ల వర్షం.. మరో రెండు రోజులు వానలే!

వీరు శుక్రవారం రాజౌరి గార్డెన్ పరిధిలోని తరుణ్ సూరి అనే కస్టమర్ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. దీనికి రూ.1,655 బిల్ అయింది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత కస్టమర్‌కు తిరిగి ఇవ్వడానికి సరిపడా చిల్లర అమన్, గుర్పాల్ సింగ్ వద్ద లేదు. దీంతో చిల్లర లేదనే కారణంతో డెలివరీ ఏజెంట్స్‌తో తరుణ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత వారిపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు.. తరుణ్‌కు సంబంధించిన మరో నలుగురు వ్యక్తులు కూడా డెలివరీ ఏజెంట్స్‌పై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక డీసీపీ గంధ్యమ్ బన్సల్ నిందితులపై కేసు నమోదు చేశారు. సెక్షన్స్ 295ఏ, 323, 341, 427 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

UPI Fraud: కొత్త నెంబర్ నుంచి యూపీఐ ద్వారా మనీ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే

కేసుపై విచారణ జరుగుతోందన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, ఆ డెలివరీ ఏజెంట్స్ ఇద్దరూ తమ ఇంట్లోని ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారని తరుణ్ ఆరోపించాడు. కాగా, తమ సంస్థ డెలివరీ ఏజెంట్స్‌పై దాడి చేసిన ఘటనపై బ్లింకిట్ స్పందించింది. బాధిత డెలివరీ ఏజెంట్స్‌కు అన్ని రకాలుగా సాయం చేస్తామని తెలిపింది. వారికి వైద్య సహాయం అందిస్తామని, పెయిడ్ లీవ్ అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

 

ట్రెండింగ్ వార్తలు