Hawala Money: వామ్మో.. కారు టైర్లలో కట్టల కట్టల డబ్బు.. రూ.4 కోట్లు సీజ్..
50 లక్షలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు RTGS చేస్తామని నమ్మించారు.
Hawala Money: సికింద్రాబాద్ లో పుష్ప సినిమా తరహాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కారును 15 కిలోమీటర్లు ఛేజ్ చేసి మరీ ముఠాను పట్టుకున్నారు బోయిన్ పల్లి పోలీసులు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కారుని సీజ్ చేశారు. కారు డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. మొత్తం 4 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఏడాదిగా నిఘా ఉంచిన పోలీసులు పకడ్బందీగా పట్టుకున్నారు.

‘కారులో రూ.4 కోట్ల నగదు లభ్యమైంది. కారు టైరు, సీట్ల కింద కరెన్సీ నోట్లు దాచారు. మొత్తం 4 కోట్ల రూపాయల డబ్బును తరలిస్తున్నారు. ముఠాను అదుపులోకి తీసుకున్నాం. వీరిపై ఏడాదిగా నిఘా ఉంచి పట్టుకున్నాం’ అని బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు తెలిపారు.
గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు నమోదైంది. 50 లక్షలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు RTGS చేస్తామని నమ్మించారు. బాధితుడి నుంచి 50 లక్షలు తీసుకొని తిరిగి డబ్బు చెల్లించకుండా మోసం చేశారు. ఆ కేసులో నిందితుడిపై నిఘా పెట్టాము. హైదరాబాద్ వస్తున్నట్టు గుర్తించి వెంబడించాము. శామీర్ పేట్ ORR నుంచి మహబూబ్ నగర వరకు నిందితులను చేజ్ చేశాము.

మహబూబ్ నగర్ జిల్లా అడక్కల్ పోలీసుల సాయంతో అక్కడే పట్టుకున్నాం. వారి వద్ద కారులో భారీగా డబ్బు గుర్తించాం. అది హవాలా డబ్బుగా తేల్చాం. కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 4.05 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నాం. ఈ డబ్బును నిందితులు గుజరాత్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించాం. ఇద్దరు నిందితులు ప్రకాశ్ ప్రజాపతి (30), ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి(28)లను అరెస్ట్ చేశాం” అని నార్త్ జోన్ డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు.
Also Read: తెలంగాణలో మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. వారు తయారు చేసిన వంటకాలు…
