Texas: టెక్సాస్‭లోని ఏకైక హిందూ దేవాలయంపై దాడి చేసిన దొంగలు, హుండీ చోరి

ఆలయం లోపల ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన ఘటన రికార్డైంది. ఒక వ్యక్తి గుడిలోకి ప్రవేశించి నేరుగా హుండీ వద్దకు వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది. చోరీపై దర్యాప్తు చేస్తున్నామని బ్రజోస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

Texas: టెక్సాస్‭లోని ఏకైక హిందూ దేవాలయంపై దాడి చేసిన దొంగలు, హుండీ చోరి

Only Hindu temple in Texas raided by burglars, donation-box stolen

Texas: అమెరికాలోని టెక్సాస్‭లో ఉన్న ఏకైక హిందూ దేవాలయంపై దాడి చేసిన దొంగలు, గుడిలోని హుండీ సహా విలువైన వస్తువులను అపహరించినట్లు స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ ఘటన అమెరికాలోని భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బ్రజోస్ వ్యాలీలోని శ్రీ ఓంకార్‌నాథ్ ఆలయంలో ఈ ఘటన జరిగిందని అక్కడి మీడియా తెలిపింది. ఇది బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం. స్థానిక హిందువులు ఈ దేవాలయంలో పూజలు చేయడంతో పాటు శాంతి కోసం ఇక్కడికి వస్తుంటారు.

Afghanistan: -34 డిగ్రీలకు తగ్గిన ఉష్ణోగ్రత.. 78 మంది మృతి

కాగా ఈ ఘటనపై బ్రజోస్ వ్యాలీ శ్రీ ఓంకార్‌నాథ్ ఆలయ బోర్డు సభ్యుడు శ్రీనివాస సుంకరి స్పందిస్తూ.. ‘‘ఒక దగ్గర బ్రేక్-ఇన్ అయి ఉంది. పక్క కిటికీలోంచి దుండగులు గుడి లోపలికి ప్రవేశించారు. హుండీతో పాటు మరిన్ని విలువైన వస్తువులు దొంగిలించారు. ఇలాంటివి జరిగినప్పుడు అభద్రతా భావం పెరుగుతుంది’’ అని అన్నారు. అయితే ఆ గుడి వెనుక ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివసించే పూజారి సహా అతని కుటుంబం క్షేమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఈ విషయాన్ని ఆదివారం జరిగిన సభలో సుంకరి సంఘం సభ్యులకు తెలియజేసినట్లు శ్రీనివాస సుంకరి తెలిపారు.

Cong to PM: 16 కోట్ల ఉద్యోగాలపై మోదీని నిలదీసిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

ఆలయం లోపల ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన ఘటన రికార్డైంది. ఒక వ్యక్తి గుడిలోకి ప్రవేశించి నేరుగా హుండీ వద్దకు వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది. చోరీపై దర్యాప్తు చేస్తున్నామని బ్రజోస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.