హైద‌రాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంట‌ర్

అమెరికా చిప్ కంపెనీ ఇంటెల్ సంస్థ హైద‌రాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించ‌నుంది. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 10:36 AM IST
హైద‌రాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంట‌ర్

అమెరికా చిప్ కంపెనీ ఇంటెల్ సంస్థ హైద‌రాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించ‌నుంది. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

అమెరికా చిప్ కంపెనీ ఇంటెల్ సంస్థ హైద‌రాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించ‌నుంది. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. మాదాపూర్‌లో ఉన్న ఐటీ హ‌బ్‌లో ఇంటెల్ త‌న కొత్త  డిజైన్ అండ్ ఇంజ‌నీరింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించ‌నున్నట్లు ఆయ‌న చెప్పారు. 

డిసెంబ‌ర్ 2వ తేదీన ఇంటెల్ సెంట‌ర్‌ను ప్రారంభిస్తారు. ఈ సెంట‌ర్‌తో హైద‌రాబాద్ ఆవిష్కర‌ణ‌ల సంస్థల‌కు మ‌రింత ఊతం ఇవ్వనుంది. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోట‌ల్ ప‌క్కన ఈ సెంట‌ర్‌ను మొద‌లుపెట్టనున్నారు. సుమారు 1500 మంది దీంట్లో ప‌నిచేస్తారు.  

స‌లార్‌పురియా స‌త్వా నాలెడ్జ్ సెంట‌ర్‌లో 6 అంత‌స్తుల‌ను ఇంటెల్ సంస్థ త‌న డిజైన్ సెంట‌ర్ కోసం తీసుకున్న‌ది. గత ఆగ‌స్టులోనే హైద‌రాబాద్‌లో అమెజాన్ త‌న సంస్థ‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన సంస్థ వ‌న్ ప్ల‌స్ కూడా త్వ‌ర‌లో భారీ సెంట‌ర్‌ను స్టార్ట్ చేయ‌నున్న‌ది.