నో టెన్షన్ : యధావిధిగా తిరుగుతున్న మెట్రో ట్రైన్స్

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 04:15 AM IST
నో టెన్షన్ : యధావిధిగా తిరుగుతున్న మెట్రో ట్రైన్స్

హైదరాబాద్ లో మెట్రో ట్రైన్స్ యధావిధిగా తిరుగుతున్నాయి. ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో మెట్రో రైళ్ల సేవలు యాధావిధిగా కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 20, 2019) ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో సాంకేతిక లోపంతో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మెట్రో సర్వీసులు స్తంభించాయి. అధికారులు 20 నిమిషాల్లో పరిస్థితిని చక్కదిద్దారు. మెట్రో రైళ్లు యాధావిధిగా నడుస్తున్నాయి. సిగ్నల్ సమస్య కారణంగా మెట్రో రైలు నిలిచిపోయిందని… పరిస్థితిని చక్కదిద్దామని మెట్రో యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం మెట్రో సర్వీసులు యధావిధిగా నడుస్తున్నాయని వెల్లడించింది.

అంతకముందు ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో సాంకేతిక లోపంతో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మెట్రో సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులతో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. అధికారులు పరిస్థితిని చక్కదిద్ది.. మెట్రో సర్వీసులను కొనసాగించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.