Narendra Modi: నారాయణపేట జిల్లాలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు జిరాక్స్ కాపీలాగా కాంగ్రెస్ మారిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఆర్ టాక్స్..

Narendra Modi: నారాయణపేట జిల్లాలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో బీజేపీ నిర్వహించిన సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరుగుతోన్న ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ధారించే ఎన్నికలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు అసత్య హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నాయని చెప్పారు.

దేశం గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని మోదీ అన్నారు. తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు అందించామని, అవన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జేబుల్లోకి వెళ్లాయని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

బీఆర్ఎస్‌కు జిరాక్స్ కాపీలాగా కాంగ్రెస్ మారిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఆర్ టాక్స్ వేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో చాలా చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. 2009లో కేసీఆర్ ను ఎన్నుకున్నారని చెప్పారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారని మోదీ అన్నారు. ఆయన ఢిల్లీ హై కమాండ్ ను ఖుషీ చేసే పనిలో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో ఈ పరిస్థితిని మార్చాలంటే బీజేపీ నేతలను ఎంపీలుగా ఎన్నుకోవాలని కోరారు. ఇక్కడి రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెప్పారు.

Also Read: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట