ఏం జరిగింది : మా టీవీ పవిత్ర బంధం సీరియల్ నటి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన సీరియల్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. సాయి అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి చున్నీతో

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 03:44 AM IST
ఏం జరిగింది :  మా టీవీ పవిత్ర బంధం సీరియల్ నటి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన సీరియల్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. సాయి అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి చున్నీతో

హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన సీరియల్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. సాయి అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

‘స్టార్ మా’ ఛాన‌ల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్ర బంధం’ సీరియల్‌లో ఝాన్సీ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. కొంతకాలంగా సూర్య అనే అబ్బాయితో ఝాన్సీ ప్రేమలో ఉందని, అతడితో సహజీవనం కూడా చేసిందని, ఇటీవల ప్రియుడితో ఆమెకు తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 2019, ఫిబ్రవరి 5వ తేదీ మంగళవారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారని, ఆ తర్వాత పేరెంట్స్‌తో కూడా గొడవ జరిగిందని, ఆ తర్వాతే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. అయితే ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటనేది తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. తమ అమ్మాయి మృతికి ప్రియుడు సూర్య కారణం అని ఝాన్సీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమ విషయంలో ప్రియుడు సూర్య మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.