దోపిడీకి వచ్చిన దొంగలముఠాను పట్టుకోబోయిన మహిళలు..పరారైన దొంగలు  

  • Published By: veegamteam ,Published On : February 18, 2020 / 04:41 AM IST
దోపిడీకి వచ్చిన దొంగలముఠాను పట్టుకోబోయిన మహిళలు..పరారైన దొంగలు   

హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి దోపిడీకి యత్నించాగా..వారిని ముగ్గురు మహిళలు అడ్డుకున్నారు. తమ ఇంట్లోకి వచ్చిన దొంగలను గమనించిన ముగ్గురు మహిళలు ధైర్యం చేశారు. దొంగల్ని అడ్డుకున్నారు. దీంతో దొంగలు మరింతగా రెచ్చిపోయారు. ఓ మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. 

వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న పంజాగుట్ట పీఎస్ పరిధిలోని అపరిచిత కాలనీలోని ఓ ఇంట్లోకి సోమవారం (ఫిబ్రవరి 17,2020) రాత్రి చొరబడ్డారు. దీన్ని గమనించిన ఆ ఇంటిలోని ముగ్గురు మహిళలు అడ్డుకున్నారు. వారిని పట్టుకోవటానికి యత్నించారు. దీంతో దొంగలు మరింతగా రెచ్చిపోయి 55 ఏళ్ల మహిళ తలపై సుత్తితో దాడి చేశారు.  దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఈ మహిళలు సామాన్యులు కాదు మనల్ని పట్టించేసేలా ఉన్నారు అనుకున్నారో ఏమోగానీ..అక్కడి నుంచి పరారయ్యారు. 

దీంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దోపిడీకి యత్నించిన ఇంటికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని రెండు బృందాలుగా విడిపోయి సదరు దొంగల కోసం గాలిస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా పుటేజ్ లకు పరిశీలిస్తున్నారు. కాగా గాయపడిన మహిళ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్సపొందుతోంది. దొంగలకు అడ్డుకునే క్రమంలో మరో ఇద్దరు మహిళలకు కూడా గాయాలయ్యాయి.