అత్తారింట్లో భార్యను చంపి శవం పక్కనే పడుకుని నిద్ర

అత్తారింట్లో భార్యను చంపి శవం పక్కనే పడుకుని నిద్ర

husband-murder-wife

Drunk Man Kills Wife: అత్తారింట్లో ఫుల్లుగా తాగిన వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో హత్య చేసి శవం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ (32) బురారీలోని సంత్ నగర్ లో ఉంటున్నాడు.

అత్తారింటికి వెళ్లి
గతంలో కోట్లాలోని ముబారక్‌పూర్ లో కుమార్ ఫొటోగ్రాఫర్ గా పనిచేసేవాడు. లాక్ డౌన్ సమయంలో పనిలేకపోవడంతో అత్తారింటికి వెళ్లిపోయాడు. ఆరు నెలల పాటు భార్య, కొడుకుతో అక్కడే ఉన్నాడు. అదే బిల్డింగ్ లో ఐదో ఫ్లోర్ లో ఉండేవాడు.

చిన్న కిరాణా షాప్
అప్పుడే ప్లంబర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. అతని భార్య చిన్న కిరాణా షాప్ నడిపేది. చిన్న చిన్న తగాదాలు, తాగుడు అలవాటు గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉండేవి. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో డిన్నర్ పూర్తి అయింది. ఓ అరగంట తర్వాత ఫుల్లుగా తాగాడని కుమార్ తో గొడవపెట్టుకుంది.

Man dies of electric shock

తెల్లవారుజామున 4గంటల 30నిమిషాలకు
ఆ గొడవలోనే హశికను గొంతు నొక్కి చంపేశాడు. తర్వాత శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున 4గంటల 30నిమిషాలకు లేచి చూసేసరికి భార్య కదలకుండా పడి ఉంది. అంతే బ్యాగు సర్దుకుని నాంగ్లోయ్ లోని సోదరి ఇంటికి పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు.

బిల్డింగ్‌లోని ఐదో ఫ్లోర్‌లోకి
బుధవారం హత్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించారు. సమాచారం అందుకున్న వెంటనే బిల్డింగ్‌లోని ఐదో ఫ్లోర్ లోకి వెళ్లిన వారికి హశిక (30) చనిపోయి కనిపించింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు మృతురాలి తల్లి చెప్తుంది’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు.