షాకింగ్, పాక్ లో హిందూ కుటుంబం అనుమానాస్పద మృతి, చంపేశారా ?

షాకింగ్, పాక్ లో హిందూ కుటుంబం అనుమానాస్పద మృతి, చంపేశారా ?

Pakistan

Pakistan : పాకిస్తాన్ లో హిందూ కుటుంబం మృతదేహాలు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఐదుగురు సభ్యుల గొంతులు కోసి ఉన్నాయి. దీంతో పాక్ లో ఉన్న హిందూ సమాజం షాక్ కు గురైంది. వారి గొంతులను పదునైన ఆయుధంతో కోసి ఉన్నాయని తెలుస్తోంది. పాక్ లోని రహీమ్ యార్ ఖాన్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబి కాలనీలో చాక్ నెంబర్ 135-పి రామ్ చంద్ నివాసం ఉంటున్నాడు.

అతని కుటుంబంలో ఉన్న ఐదుగురు విగతజీవులుగా శుక్రవారం కనిపించడం కలకలం రేపింది. పదునైన ఆయుధాలతో వారి గొంతులను కోసినట్లు, ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి ఉండొచ్చని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కత్తి, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై సోషల్ యాక్టివిస్ట్ బిర్బాల్ దాస్ The News International తో మాట్లాడారు. రామ్ చంద్ మెగ్వాల్ హిందూ కమ్యూనిటీకి చెందిన వారని, 35 ఏళ్ల వయస్సున్న అతను చాలాకాలంగా ట్రైలర్ షాప్ నడుపుకుంటూ..జీవితం గడుపుతున్నారని వివరించారు. కుటుంబంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాడని, ఈ ఘటన చాలా దిగ్ర్భాంతికి గురి చేసిందన్నాడు. వారు ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా హత్య చేశారా ? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.