JNBY : ‘భారతీయులను కాల్చి చంపుతా’.. చైనా కంపెనీ ఉన్మాదం.. చిన్నారుల దుస్తులపై ద్వేషపూరిత రాతలు

చైనా ప్రభుత్వానికే కాదు అక్కడి కంపెనీలకు కూడా భారత్ అంటే ద్వేషమే. చాన్స్ చిక్కితే చాలు ఇండియాపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. తాజాగా చైనాకి చెందిన ఓ పెద్ద కంపెనీ భారతీయులపై తన అక్క

JNBY : ‘భారతీయులను కాల్చి చంపుతా’.. చైనా కంపెనీ ఉన్మాదం.. చిన్నారుల దుస్తులపై ద్వేషపూరిత రాతలు

Jnby

JNBY : చైనా ప్రభుత్వానికే కాదు అక్కడి కంపెనీలకు కూడా భారత్ అంటే ద్వేషమే. చాన్స్ చిక్కితే చాలు ఇండియాపై విషం చిమ్ముతున్నాయి. తాజాగా చైనాకి చెందిన ఓ పెద్ద కంపెనీ భారతీయులపై తన అక్కసును నీచ మార్గంలో వెళ్లగక్కింది. చిన్నపిల్లలు ధరించే దుస్తులపై భారతీయులను కించపరిచేలా, వారి మనసులు గాయపడేలా వివిధ కామెంట్లు ప్రింట్ చేసింది. ఆ ప్రముఖ బ్రాండ్ పేరు జేఎన్‌బీవై. చైనాలో జేఎన్ బీవై ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్. ఈ కంపెనీకి సుమారు 2 వేల స్టోర్లు ఉన్నాయి. అమెరికా, కెనడా వంటి దేశాల్లో కూడా దుకాణాలు ఉన్నాయి.

Andhra Pradesh : వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఇటీవల చైనాకు చెందిన మోగు మోగు అనే యువతి కొడుక్కి వాళ్ల తాతయ్య, నానమ్మ బ్రాండెడ్ దుస్తులు కొన్నారు. అయితే వారిద్దరికీ ఇంగ్లీష్ రాకపోవడంతో వాటిపై ఉన్న ప్రింటెడ్ రాతలకు అర్థం తెలియలేదు. కానీ మోగు ఈ టీషర్ట్ చూడగానే ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నరకానికి స్వాగతం’ అంటూ ప్రింట్ చేసిన దుస్తుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిందామె.

AP Secretariat : సచివాలయం ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత

‘‘ఒక చిన్న పిల్లాడు ఇలాంటి మాటలున్న షర్టు ధరిస్తాడని తలచుకుంటేనే భయమేస్తోంది’’ అని ఆమె సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా ఒక ఫొటో షేర్ చేశారు. ‘ఈ ప్రాంతం మొత్తం భారతీయులతో నిండిపోయి ఉంది. నేను ఈ తుపాకీ తీసుకొని వాళ్లందర్నీ తూట్లు పొడిచేస్తా’ అంటూ ఆ దుస్తులపై ఓ స్లోగన్ ప్రింట్ చేసి ఉంది.

ఇది వివాదానికి దారి తీయడంతో జేఎన్‌బీవై కంపెనీ క్షమాపణ చెప్పింది. ఇలాంటి రాతలు ఎలా ప్రింట్ అయ్యాయో తెలియదని, ప్రిటింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని వివరణ ఇచ్చింది. అయితే భారతీయులను కించపరుస్తూ చేసిన ప్రింట్లపై మాత్రం ఎటువంటి కామెంట్ చేయలేదు.

ఈ కంపెనీకి చెందిన దుస్తులపై ఇలా 2018 నుంచి నీచపు రాతలు కనిపిస్తున్నాయని మోగు ఆరోపించింది. దీని గురించి సోషల్ మీడియాలోనే కాకుండా, స్థానికంగా ఉన్న దుకాణం ముందు కూడా కొందరు నిరసన వ్యక్తం చేశారని తెలిపింది. అయినా కంపెనీ తమ వైఖరి మార్చుకోలేదని విమర్శించింది.