AP Secretariat : సచివాలయం ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు నవంబర్ 1 నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

AP Secretariat : సచివాలయం ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత

Ap Secretariat

AP Secretariat :  అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు నవంబర్ 1 నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం మంజూరు చేసింది.

సచివాలయం, శాసన మండలి, హెచ్ఓడీ విభాగాల ఉద్యోగులకు వసతిని నిలిపేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 1 నుంచి వసతి ఖర్చును ఉద్యోగులే భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వారికి షేరింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది.