Kidnapped Woman: కిడ్నాప్ చేసి మనిషి మాంసం తినమని మహిళకు బలవంతం

కాంగో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటెంట్లు ఒక కాంగో మహిళను రెండుసార్లు కిడ్నాప్ చేశారు. పదేపదే రేప్ జరపడంతో పాటు బలవంతంగా మానవ మాంసాన్ని వండుకుని తినేలా చేశారు. ఈ విషయంపై కాంగో హక్కుల సంఘం బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలిపింది.

Kidnapped Woman: కిడ్నాప్ చేసి మనిషి మాంసం తినమని మహిళకు బలవంతం

Un

Kidnapped Woman: కాంగో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటెంట్లు ఒక కాంగో మహిళను రెండుసార్లు కిడ్నాప్ చేశారు. పదేపదే రేప్ జరపడంతో పాటు బలవంతంగా మానవ మాంసాన్ని వండుకుని తినేలా చేశారు. ఈ విషయంపై కాంగో హక్కుల సంఘం బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలిపింది.

మహిళా హక్కుల సంఘం మహిళా సాలిడారిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ పీస్ అండ్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ జులియెన్ లుసెంగే… 15 మంది సభ్యుల కౌన్సిల్‌లో ప్రసంగిస్తూ మహిళ ఘటన గురించి వివరించారు. కాంగోపై రెగ్యూలర్ బ్రీఫింగ్ కోసం UN భద్రతా మండలి సమావేశమైంది. మే చివరి నుంచి ప్రభుత్వం తిరుగుబాటు గ్రూపుల మధ్య భారీ పోరాటం హింసాత్మకమైంది.

తనపై పదేపదే అత్యాచారం జరిపి శారీరకంగా వేధింపులకు గురిచేశారని మహిళ హక్కుల సంఘానికి తెలిపింది. ఆ తర్వాత ఉగ్రవాదులు వ్యక్తి గొంతు కోశారని చెప్పింది.

Read Also: ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్‌కు వార్నింగ్

“అతని పేగులను బయటకు తీసి.. వండమని అడిగారు. మిగిలిన భోజనం సిద్ధం చేయడానికి రెండు నీటి కంటైనర్లు తెచ్చారు. దాంతోపాటు ఖైదీలందరికీ మానవ మాంసాన్ని తినిపించారు” అని లుసెంగే భద్రతా మండలికి వివరించారు.

కొన్ని రోజుల తర్వాత మహిళను విడుదల చేశారని, అయితే ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మరొక మిలీషియా బృందం ఆమెను కిడ్నాప్ చేసిందని, దాని సభ్యులు ఆమెపై పదేపదే అత్యాచారం చేశారని లుసెంజ్ చెప్పారు.

“మళ్ళీ మానవ మాంసాన్ని ఉడికించి తినమని అడిగారు” అని చివరికి తప్పించుకున్న మహిళ సోఫెపాడితో చెప్పింది. లూసెంజ్ కౌన్సిల్ బ్రీఫింగ్ సందర్భంగా రెండో మిలిటెంట్ గ్రూప్ పేరును పేర్కొనలేదు.