వర్మ దిశ సినిమాకు సెన్సార్ షాక్..

వర్మ దిశ సినిమాకు సెన్సార్ షాక్..

Disha Encounter: గతకొంత కాలంగా క్రియేటివిటీని పక్కన పెట్టి వాస్తవ సంఘటనల ఆధారంగానే సినిమాలు తీస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్నారు కాంట్రవర్సీ కింగ్.. వివాదాస్పద దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలకు పబ్లిసిటీ ఎలా చెయ్యాలనేది వర్మకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఓ సినిమా విషయంలో మాత్రం కోర్టులో వర్మ పప్పులు ఉడకడం లేదు.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా వర్మ తెరకెక్కించిన చిత్రం ‘దిశ ఎన్‌కౌంటర్’.. ఇంతకుముందే ఈ సినిమా గురించి తెలంగాణ హైకోర్టు ఆర్జీవీకి షోకాజు నోటీసులు జారీ చేసింది. తాజాగా సెన్సార్ బోర్డ్ కూడా షాకిచ్చింది. ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాకి సెన్సార్ బోర్డ్ బ్రేక్ వేసింది.

సినిమా సెన్సార్ కోసం వస్తే పర్మిషన్ ఇవ్వలేదు సరికదా.. అసలు సెన్సార్ ఇవ్వాలో లేదో కూడా తేల్చుకోలేకపోయారు సెన్సార్ బోర్డ్ సభ్యులు..
సెన్సార్ బృందం రిజెక్ట్ చేయడంతో సినిమా రివిజన్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. ఇప్పటికే ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాపై బాధితురాలు తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Disha Encounter