Booster Dose : అర్హులైన వారికి నేటి నుంచి బూస్టర్ డోస్
దేశవ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు.
Booster Dose : దేశవ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. దేశంలోని 1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల ఫ్రంట్లైన్ వర్కర్లు, 2.75 కోట్ల 60 ఏళ్ల పైబడినవారు ప్రికాషన్ డోసు వేసుకోనున్నారని ప్రభుత్వం అంచనా వేసింది.
రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రికాషన్ డోసు వేయనున్నారు. ప్రికాషన్ డోసు అర్హులైనవారికి ఇప్పటికే కోవిన్ పోర్టల్ నుంచి కేంద్ర ప్రభుత్వం మెసేజ్ లు పంపించింది.
ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవాలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందిని ఫ్రంట్లైన్ వర్కర్లుగానే గుర్తించి వారికీ ప్రికాషన్ డోస్ వేయనున్నారు. గతంలో రెండు సార్లు తీసుకున్న వ్యాక్సిన్ నే ప్రికాషన్ డోసు కింద ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
Also Read : South Central Railway : రెండు ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
కొవిడ్-19 ప్రికాషన్ డోసు పొందాలనుకుంటున్న లబ్ధిదారులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న అర్హులైన వారు నేరుగా అపాయింట్మెంట్ తీసుకోకుండా….. నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.