సలాం సంతోష్ : హాకీంపేటకు చేరుకోనున్న సంతోష్ బాబు పార్థివదేహం!

  • Published By: srihari ,Published On : June 17, 2020 / 01:08 PM IST
సలాం సంతోష్ : హాకీంపేటకు చేరుకోనున్న సంతోష్ బాబు పార్థివదేహం!

హాకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు అమరుడైన తెలంగాణకు చెందిన సైనికుడు సంతోష్ బాబు పార్థివ దేహం త్వరలో చేరుకోనుంది. ఇప్పటికే సంతోష్ బాబు భార్యాపిల్లలను హాకీంపేటకు పోలీసులు తీసుకెళ్లారు. సంతోషబాబు భౌతిక కాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకొస్తున్నారు. కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని తెలంగాణ గవర్నర్ తమిళసై, హోం మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి సహ స్థానిక మంత్రులు, అధికారులు నివాళలర్పించనున్నారు. సంతోష్ బాబుకు ఆర్మీ అధికారులు సైనిక వందనం సమర్పించనున్నారు.

ఇప్పటికే హాకీంపేటకు సంతోష్ బాబు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు సంతోష్ బాబు భౌతికకాయం సూర్యాపేటకు చేరుకోనుంది. ఇందులో కుటుంబ సభ్యులతో పాటు సంతోష్ బాబు పార్థివదేహాన్ని సూర్యాపేట స్వస్థలానికి ప్రత్యేక వాహనంలో తరలించనున్నారు. రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో సంతోష్ బాబు అంత్యక్రియలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులతో పాటు ఎస్పీ అధికారులు పరిశీలించారు. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సంతోష్ బాబు తుది అంత్యక్రియలను నిర్వహించనున్నారు.