Puneeth Rajkumar : పునీత్ చివరి సినిమా చూస్తూ థియేటర్లో ఏడ్చేస్తున్న అభిమానులు.. వైరల్ అవుతున్న వీడియో

థియేటర్లో తెరపై తమ అభిమాన హీరోని చూస్ ఫ్యాన్స్ కంటతడి పెడుతున్నారు. ఓ వైపు పునీత్‌ యాక్షన్స్‌ సీన్స్‌ చూసి ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరో వైపు పునీత్ చివరి సినిమా అని బాధని.........

Puneeth Rajkumar : పునీత్ చివరి సినిమా చూస్తూ థియేటర్లో ఏడ్చేస్తున్న అభిమానులు.. వైరల్ అవుతున్న వీడియో

Puneeth Fans

 

Puneeth Rajkumar :  కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గతేడాది అక్టోబర్ 29న ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులకు, కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు మార్చి 17 పునీత్‌ జయంతి సందర్భంగా ‘జేమ్స్’ సినిమాని రిలీజ్ చేశారు.

‘జేమ్స్’ సినిమాని కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 4,000 థియేటర్లలో ఈ సినిమా భారీగా విడుదలవుతోంది. అభిమానులు కటౌట్స్, బ్యానర్స్ కట్టి, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. కర్ణాటకలో అన్ని థియేటర్స్ ఈ వీకెండ్ వరకు హౌస్ ఫుల్ అయిపోయాయి.

James : పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్ థియేటర్స్..

ఇక థియేటర్లో తెరపై తమ అభిమాన హీరోని చూస్ ఫ్యాన్స్ కంటతడి పెడుతున్నారు. ఓ వైపు పునీత్‌ యాక్షన్స్‌ సీన్స్‌ చూసి ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరో వైపు పునీత్ చివరి సినిమా అని బాధని వ్యక్తం చేస్తున్నారు. పునీత్ వీరాభిమానులు సినిమా చూస్తూ ఏడుస్తున్నారు. చాలా థియేటర్స్ లో ఇదే జరుగుతుంది. తెరపై పునీత్ ని చూసి అభిమానులు ఏడుస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోసారి కన్నడ ప్రజలు పునీత్ ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.