Rakshitha : గుడిలో ‘ఇడియట్’ హీరోయిన్‌ను చుట్టుముట్టిన జనాలు

‘ఇడియట్’ హీరోయిన్ రక్షిత ఉడిపిలోని ఓ గుడికి వెండి దీపాలు, వెండి ప్లేటులు విరాళంగా ఇచ్చారు..

Rakshitha : గుడిలో ‘ఇడియట్’ హీరోయిన్‌ను చుట్టుముట్టిన జనాలు

Rakshitha

Rakshitha: ‘ఇడియట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రక్షిత. ‘ఆంధ్రావాలా’, ‘శివమణి’, ‘నిజం’, ‘అందరివాడు’ వంటి మూవీస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలోనూ స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. 2007లో శాండల్‌వుడ్ డైరెక్టర్ ప్రేమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Comedy Khiladigalu

అప్పటినుంచి సినిమాలు చెయ్యట్లేదు. కొంత గ్యాప్ తర్వాత కన్నడ టీవీ షోల్లో బిజీ అయిపోయింది. ‘కామెడీ ఖిలాడిగలు’, ‘డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్’ అనే పాపులర్ రియాలిటీ షోలకు రక్షిత జడ్జిగా అక్కడి ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్‌గా ఆమె ఓ టెంపుల్‌ని విజిట్ చేసింది.

Dance Karnataka Dance 2021

రక్షిత కర్ణాటకలోని ఉడిపిలో గల కొరగజ్జా టెంపుల్‌ను సందర్శించింది. దర్శనం తర్వాత వెండి దీపాలు, వెండి ప్లేటులు విరాళంగా ఇచ్చారు. గుడిలోనుండి బయటకొస్తుండగా రక్షితను చూసి అక్కడి జనాలు ఫొటో దిగడానికి పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ఆలయ అధికారులు ఆమె వెళ్లే వరకు సెక్యూరిటీగా ఉన్నారు. తర్వాత రాజ రాజేశ్వరి, కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయాలను సందర్శించి బెంగుళూరు పయనమయ్యింది రక్షిత.

 

View this post on Instagram

 

A post shared by Rakshitha? (@rakshitha__official)