వీడిన బాలుర మర్డర్ మిస్టరీ.. లైంగిక దాడి చేసి కోరిక తీర్చుకుని దారుణ హత్య, గుంటూరు పోలీసుల అదుపులో 19ఏళ్ల సైకో

గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు బాలుర మర్డర్, మిస్సింగ్ మిస్టరీ వీడింది. కేసు విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయి. లైంగిక దాడి చేసి బాలురను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్లు చేసింది 19ఏళ్ల యువకుడు అని తెలిసి విస్తుపోయారు. ప్రస్తుం ఆ సైకో పోలీసుల అదుపులో ఉన్నాడు.

వీడిన బాలుర మర్డర్ మిస్టరీ.. లైంగిక దాడి చేసి కోరిక తీర్చుకుని దారుణ హత్య, గుంటూరు పోలీసుల అదుపులో 19ఏళ్ల సైకో

Guntur Police Arrest Psycho Who Killed Two Boys

guntur police arrest psycho who killed two boys: గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు బాలుర మర్డర్, మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. కేసు విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయి. లైంగిక దాడి చేసి కోరిక తీర్చుకుని బాలురను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్లు చేసింది 19ఏళ్ల యువకుడని తెలిసి విస్తుపోయారు. ప్రస్తుతం ఆ సైకో పోలీసుల అదుపులో ఉన్నాడు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో పక్కపక్కనే ఉండే మెల్లంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. దీంతో ఒక్కసారిగా గ్రామాల్లో కలకలం రేగింది. ఓ బాలుడు అదృశ్యమైన రెండో రోజే మృతదేహమై కనిపించడం మరింత సంచలనమైంది. తాడేపల్లి పోలీసులు ఈ రెండు కేసులను సవాల్ గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేశారు. మిస్సింగ్, మర్డర్ మిస్టరీని చేధించారు. నిందితుడిని పట్టుకున్నారు.

పోలీసుల అనుమానమే నిజమైంది:
మెల్లంపూడి గ్రామంలో మార్చి 14న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న కుర్ర భార్గవతేజ (6) అదృశ్యం అయ్యాడు. కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పిల్లాడి కోసం అంతా వెతుకుతున్నారు. అదే గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపయ్య అలియాస్‌ గోపీ అనే 19 ఏళ్ల యువకుడు కూడా బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు ఓవరాక్షన్ చేశాడు. పోలీసులకు ఎందుకో గోపీపై అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. అంతే, గోపీ నేరం ఒప్పుకున్నాడు. తన దురాఘతాలు బయటపెట్టాడు.

మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి:
ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవతేజకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లినట్టు నిందితుడు గోపీ చెప్పాడు. ఆ తర్వాత బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి లైంగిక దాడి జరిపి, అనంతరం తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు తెలిపాడు. ఆ తర్వాత బాలుడి మృతదేహం కాళ్లు, చేతుల్ని విరిచేసి, ముఖాన్ని గాయపర్చి ఇంటి వెనుకున్న అరటి తోటలో పడేసినట్టు వెల్లడించాడు. పోలీసులు గురువారం(మార్చి 18,2021) గోపీని ఘటనా స్థలానికి తీసుకెళ్లి నేరం జరిగిన తీరును సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

మరో బాలుడినీ ఇదే విధంగా..
ఫిబ్రవరి 11న వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి మరియదాసు, మీనాక్షి కుమారుడు బండి అఖిల్‌ (8) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆడుకోవడానికి వెళ్లి.. ఆ తర్వాత కనిపించ లేదు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడు అఖిల్‌ ఆడుకుంటూ వెళ్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌లో పడిపోయి ఉంటాడని భావించిన పోలీసులు, బంధువులు విస్తృతంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. భార్గవతేజ అదృశ్యమైన తీరు, అఖిల్‌ అదృశ్యమైన తీరు ఒకేలా ఉండటంతో నిందితుడు గోపీని పోలీసులు నిలదీశారు. అఖిల్‌ను కూడా భార్గవతేజ తరహాలోనే మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక వాంఛ తీర్చుకుని, హత్య చేసినట్టు విచారణలో గోపీ ఒప్పుకున్నాడు.

14 ఏళ్ల వయసులోనే తొలి అకృత్యం:
నిందితుడు గోపీలో సైకో స్వభావాలున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు 14 ఏళ్ల వయసులో తన స్నేహితుడిని సెకండ్‌ షో సినిమాకు తీసుకువెళ్లి ఇదే తరహాలో హతమార్చినట్టు తెలుస్తోంది. సినిమా మధ్యలో ఫ్రెండ్ ని బయటకు తీసుకొచ్చిన గోపీ అతడిపై లైంగిక దాడి చేసి చంపి, మృతదేహాన్ని రేవేంద్రపాడు బ్రిడ్జి మీద నుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌లో పడేసినట్టు గ్రామస్తులు చెబుతుంటారు. అప్పట్లో కాలనీ వాసులంతా జరిగిందేదో జరిగిపోయింది కేసులు వరకు ఎందుకు, పిల్లాడి భవిష్యత్‌ నాశనం చేయడం ఎందుకంటూ మృతి చెందిన బాలుడి తండ్రిని బుజ్జగించడంతో అప్పట్లో కేసు నమోదు కాలేదనే ప్రచారం ఉంది.

గోపీ తండ్రిదీ నేర ప్రవృత్తే:
గోపీ తండ్రిది కూడా నేర ప్రవృత్తేనని గ్రామస్తులు చెబుతున్నారు. అతడు మొదటి భార్యను హత్య చేసిన కేసులో 14ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చాక మరో మహిళను వివాహం చేసుకున్నాడు. గోపీ చేసిన దురాఘతాలు వెలుగులోకి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ సైకోని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.