Ind vs Eng: ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదో టెస్టు రద్దు

ఇంగ్లాండ్ తో జరగాల్సిన చివరిదైనా ఐదో టెస్టు వాయిదా పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 10)న జరగాల్సిన మ్యాచ్ పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Ind vs Eng: ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదో టెస్టు రద్దు

Ind Vs Eng

Ind vs Eng: ఇంగ్లాండ్ తో జరగాల్సిన చివరిదైనా ఐదో టెస్టు రద్దయింది. శుక్రవారం (సెప్టెంబర్ 10)న జరగాల్సిన మ్యాచ్ ను ఒకరోజు వాయిదావేయాలని  భావించినప్పటికీ… ప్లేయర్లలో కరోనా కేసులు పెరగడంతో ఏకంగా రద్దు నిర్ణయమే తీసుకున్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియాతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. ఇండియా అసిస్టెంబ్ ఫిజియో థెరఫిస్ట్ యోగేశ్ పర్మార్ కు గురువారం పాజిటివ్ రావడంతో ఇరు జట్లలో టెన్షన్ వాతావరణం ఏప్పడింది.

ఇదిలా ఉంటే శుక్రవారం మరో ప్లేయర్లో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తుండటంతో నిర్ధారణ కోసం చేయించిన పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది. గురువారం కూడా పరీక్షలు చేయగా.. నెగెటివ్ ఫలితాలు వచ్చాయి.

ఐదో టెస్టు జరగాల్సిన శుక్రవారం మ్యాచ్.. గురించి కోల్ కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్,.. దినేశ్ కార్తీక్ సోషల్ మీడియాలో మ్యాచ్ వాయిదా పడినట్లు హింట్ ఇచ్చాడు. ‘ఇవాళ ఆటలేదు.. ఓకే టాటా బై బై’ అని చెప్పాడు. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే ఇండియా 2-1 తేడాతో లీడ్ సాధించింది. మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. చివరి టెస్ట్ రద్దు కావడంతో… టెస్ట్ సిరీస్ ఇండియా గెల్చినట్టయింది.

Sai Dharam Tej: యాక్సిడెంట్‌కు గురైన బైక్ విలువెంతో తెలుసా..