Irrfan Khan : ఇర్ఫాన్ ఖాన్ చివరి సినిమా రిలీజ్కి సిద్దమవుతుంది.. పాటతో తేలు కాటుకు విరుగుడు!
2020 లో మరణించిన బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చివరి సినిమా విడుదలకు సిద్దమవుతుంది. సినిమా కథ ఎంతో తెలుసా?
Irrfan Khan : బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఇర్ఫాన్ 2020 లో మరణించారు. అయన మరణం సినీ ప్రపంచాన్ని తీవ్రంగా బాధ పెట్టింది. ఇర్ఫాన్ ఖాన్ తెలుగు సినిమాలో కూడా నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ విలన్ గా కనిపించారు. కాగా ఈ నటుడు నటించిన చివరి సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దమవుతుంది.
Shaakuntalam : నాగచైతన్య ఫ్యాన్స్ వల్లే శాకుంతలం ప్లాప్.. బిగ్బాస్ నటి వ్యాఖ్యలు!
2017 లో ఇర్ఫాన్ రాజస్థానీ సినిమాలో నటించాడు. ది సాంగ్ అఫ్ స్కార్పియన్స్ (The Song of Scorpions) అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. అనూప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో గోల్షిఫ్తే ఫరహాని (Golshifteh Farahani), వహీదా రెహ్మాన్, శశాంక్ అరోరా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని 2017 లో 70వ లోకార్నో ఫిలిం ఫెస్టివల్ (70th Locarno Film Festival) లో కూడా ప్రదర్శన చేశారు. కాగా ఏప్రిల్ 28న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుండగా నేడు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ఈ సినిమా కథ విషయాన్ని వస్తే.. మొత్తం రాజస్థాన్ ఎడారి బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో తేలు కుట్టడం వల్ల వ్యక్తి 24 గంటలలోనే మరణిస్తుంటారు. అయితే ఆ తేలు కాటుకి విరుగుడు ఒక గిరిజన మహిళ (గోల్షిఫ్తే ఫరహా) పడే పాట మాత్రమే. ఆ స్కార్పియన్ సాంగ్ ని గోల్షిఫ్తే ఫరహా తన అమ్మమ్మ దగ్గర నేర్చుకుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ గ్రామం వారు గోల్షిఫ్తే ఫరహాను ఊరు నుంచి వెలివేస్తారు. ఆ తరువాత ఆమె ఒంటెల వ్యాపారి అయిన ఇర్ఫాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటుంది. ఇక దాని తరువాత ఆమె ఏడుకున్న కొన్ని సమసయ్లను ఆమె ఎలా ఎదురుకుంది అనేది సినిమా కథ.