Kerala : 7నెలల గర్భంతో ISISలో చేరిన కూతురు, ఆమెకు పుట్టిన బిడ్డ కోసం తల్లి ఆవేదన

ఉగ్రవాదిని వివాహం చేసుకుని.. ఐసిస్‌లో చేరి కేరళ యువతి నైమిషా అలియాస్ ఫాతిమా, ఆమె కుమార్తె ల కోసం నైమిష తల్లి తల్లడిల్లుతున్నారు. తన బిడ్డ, మనుమరాలి..

Kerala : 7నెలల గర్భంతో ISISలో చేరిన కూతురు, ఆమెకు పుట్టిన బిడ్డ కోసం తల్లి ఆవేదన

Kerala Woman Who Joined Isis

kerala woman joined isis afghanistan mother appeal : అప్గాన్ తాలిబన్ల వశం అయిన క్రమంలో భారత్ లోని కేరళకు చెందిన ఓ తల్లి తన కూతురు కోసం తల్లడిల్లతోంది. మనుమరాలిని చూడాలని తపన పడుతోంది.తన కూతురు మనుమరాలు ఏమయ్యారోనని ఆందోళనపడుతోంది ఆ తల్లి హృదయం. ఆ తల్లి కూతురు అఫ్గాన్ లో స్థిరపడిన వ్యక్తి కాదు. ఆమె ప్రముఖ ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్‌’ ఉగ్రవాది. ఉగ్రవాది అయిన తన కూతురుకి..ప్రస్తుత అప్గాన్ సంక్షోభానికి సంబంధం ఏంటీ అనేది తెలుసుకోవాలంటే దాదాపు ఆరు సంవత్సరాల క్రితం జరిగిన విషయం తెలుసుకోవాలి. ఏడు నెలల గర్భవతిగా ఉన్న కూతురు ఉగ్రవాదంలోకి వెళ్లిపోయిన కూతురు కోసం ఆ తల్లి ఎదురు చూస్తునే ఉంది. ఈ అప్గాన్ సంక్షోభం సమయంలో అయినా తన బిడ్డ కోసం ఆ బిడ్డకు పుట్టిన బిడ్డ కోసం ఎదురు చూస్తోంది. నాకూతురిని మనుమరాలిని తన వద్దకు చేర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఆ తల్లి మనోవేదన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉగ్రవాదిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కేరళకు చెందిన నైమిషా అలియాస్ ఫాతిమా అనే యువతి. డెటిస్టుగా ఉండే నైమిషా ఫాతిమాగా మరింది. ఏడు నెలల గర్భవతిగా ఉండగా భర్త బలవంతంగా ఐసిస్ లో చేరిపోయింది. ఆ తరువాత ఆమెకు పుట్టిన బిడ్డతో కలిసి 2019 నుంచి అఫ్గన్ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉంటోంది. ఈక్రమంలో ప్రస్తుతం అఫ్గాన్ తాలిబన్ల వశం కావటంతో అక్కడి జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని తాలిబన్లు వదిలేశారు. దీంతో అక్కడ జైలులో బంధీలుగా ఉన్న తన కుమార్తె నైమిషా ఆమెకు పుట్టిన బిడ్డను స్వదేశానికి తీసుకురావటానికి సహకరించాలని ప్రభుత్వాన్ని నైమిష తల్లి బిందూ సంపత్ అభ్యర్థించారు. అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. జైళ్లలోని ఉగ్రవాదులను వదిలేయడంతో తన కూతురు..మనవరాలు ఎక్కడున్నారో ఎటువంటి సమాచారం లేదని వారి గురించి తనకు ఏమీ తెలియటంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

‘వారిని విడుదల చేసినట్టు వార్తలు రావడంతో వారు నా దగ్గరకు వస్తారని చాలా సంతోషపడ్డాను. కానీ, అదే రోజు సాయంత్రానికి వారు విడుదల కాలేదని వారిని తిరిగి ఉగ్రవాదులకు అప్పగించారనే వార్త విని హడలిపోయాను. తన బిడ్డ, మనవరాలిని చూడలేనేమోనని తల్లడిల్లిపోతున్నాను. వారికి ఏమవుతుందోనని..వారి భారత్ కు వస్తారో రారోనని రాలేమోదోనని భయపడుతున్నాను’ అని బిందు సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. నైమిషా సహా కేరళకు చెందిన మరో మహిళను అప్పగించడానికి అఫ్గన్ సిద్ధపడిందని..నైమిషా కుమార్తె గురువారంతోనే నాలుగేళ్ల పూర్తయి ఐదో ఏట అడుగుపెడుతోందని తన మనుమరాలు పుట్టిన తరువాత నేను కనీసం ఒక్కసారి కూడా చూడలేకపోయానని తెలిపారు.

‘ఒకవేళ ఆమె నా భారతదేశానికి హాని తలపెట్టి ఉంటే ఆమెను వారి నుంచి స్వాధీనం చేసుకుని భారతీయ చట్టాల ద్వారా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి..నేను గత నాలుగేళ్లుగా అదే చెబుతున్నాను..అని తెలిపారు.ఆమెను ఆఫ్గన్ నుంచి తీసుకొస్తే నేను నా మనవరాలిని చూసుకోగలను. లేకపోతే ఆమె ఈ ఉగ్రవాదులకు బలి అయిపోతుంది. దయచేసి అటువంటి పరిస్థితి తీసుకురావద్దని నేను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు.భారత ప్రభుత్వం ఆమెను ఎందుకు తిరిగి ఇక్కడకు తీసుకురావటానికి యత్నించటంలేదో నాకు తెలియదు’అని వాపోయారు.

తన కుమార్తె 2017లో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె తిరిగి కనిపించలేదు. ఈ విషయంలో కేరళ మంత్రి మురళీధరన్ సహా పలువురికి పలుమార్లు విన్నవించుకున్నాను. సహాయం చేయమని అర్థించాను. దీనిపై కేరళ హైకోర్టులో వేసిన పిటిషన్ వచ్చే మంగళవారం విచారణకు రానుంది అని బిందు తెలిపారు.

‘నా కుమార్తెను ఉగ్రవాదులు, తిరువనంతపురం కోచింగ్ సెంటర్‌లోని ఓ డాక్టర్ కలిసి ఆమె మనస్సు మార్చేశారు. ఆమె బ్రెయిన్‌వాష్ చేసి ఉగ్రవాదంవైపు మళ్లేలా చేశారు. 2017లో కేరళకు చెందిన 21 మంది కనిపించకుండాపోయారు. దీని వెనుక అబ్దుల్ రషీద్ సహా మరో నలుగురి హస్తం ఉంది’ అని తెలిపారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బిందూ సంపత్ ఆవేదనతో ఆరోపించారు. మొత్తం 21 మందిని తీసుకెళ్లిన వ్యక్తిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. మీడియా సహా ప్రతి ఒక్కరూ వేధించడంతో నేను బాధితురాలిగా మిగిలిపోయాను’ అని కన్నీంటిపర్యంతమయ్యారు. ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయింది.. నా మనవరాలికి నాలుగు నిండి ఐదో సంవత్సరం వస్తుంది. ఇప్పటి వరకూ నేను ఆ నా మనుమరానికి చూడనేలేదని ఇప్పటికైనా భారత ప్రభుత్వం నా కూతురిని వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆమె దేశానికి ద్రోహం చేసి ఉంటే భారత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కానీ నా మనుమరాలి పరిస్థితి గురించి ఆలోచించి ఆమెను నాకు అప్పగించాలని కోరుతున్నానని ఆమె తెలిపారు.

కాగా కేరళలో డెంటిస్ట్‌ గా పనిచేసే నైమిష ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడి కోరిక మేరకు ఇస్లాం స్వీకరించి ఫాతిమాగా మారింది. ఆ తర్వాత ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరాలని భర్త ఒత్తిడి చేయడంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా భర్త కోసం 2016లో ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయింది. అలా అప్పుడ గడపదాటిని నైమిష జీవితం ఐసిసిస్ వశమైంది. అప్పటికే ఆమె ఏడు నెలల గర్భవతి కావడంతో అఫ్గన్‌ వెళ్లి ఐసిస్‌లో చేరిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది. ఆతరువాత కొంతమంది ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్న అప్గాన్ ప్రభుత్వం ఫాతిమ అలియాస్ నైమిష ఆమె బిడ్డను జైలులో బంధించింది. ఇప్పుడు తాలిబన్లు వారిని విడుదల నేపథ్యంలో కూతురు..మనుమరాలి కోసం కేరళ తల్లి తల్లడిల్లుతోంది.