మైత్రీ లైనప్ మామూలుగా లేదుగా!
Mythri Movie Makers: ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూటర్స్గా కెరీర్ స్టార్ట్ చేసి, నేడు టాలీవుడ్లో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా పేరు తెచ్చుకోవడంతో పాటు తమ బ్యానర్ని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్గా నిలబెట్టారు ప్రముఖ నిర్మాతలు.. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు.. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి..
సూపర్స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’తో నిర్మాతలుగా ప్రస్థానం ప్రారంభించి, వరుసగా ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి మూడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.
రీసెంట్ బ్లాక్బస్టర్ ‘ఉప్పెన’ వరకు పది సినిమాలు తీశారు. ఇప్పుడు మరో పది సినిమాలు లైన్లో పెట్టారు. అవన్నీ కూడా భారీ, క్రేజీ ప్రాజెక్టులే.. బహుశా ప్రస్తుతం ఏ నిర్మాణ సంస్థ కూడా ఇంత బిజీగా ఉండి ఉండదేమో.
సూపర్స్టార్ మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ‘సర్కారు వారి పాట’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్న ‘పుష్ప’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా చెయ్యనున్నారు. నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్తో చేస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్, నటసింహా నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.