Radhe Shyam: రాధేశ్యామ్‌కి ఓటీటీ ఆఫర్.. రూ.400 కోట్లకు పైగా డీల్!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా రాధే శ్యామ్. ఈ వారం రావాల్సిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడినా.. మేము వస్తామంటూ రాధేశ్యామ్ రిలీజ్..

Radhe Shyam: రాధేశ్యామ్‌కి ఓటీటీ ఆఫర్.. రూ.400 కోట్లకు పైగా డీల్!

Radheshyam

Radhe Shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా రాధే శ్యామ్. ఈ వారం రావాల్సిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడినా.. మేము వస్తామంటూ రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధ కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా వచ్చే జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీగా ఉండగా పలు అనుమానాలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందా.. రాధేశ్యామ్ వస్తాడా రాడా అని ఎన్నో అనుమానాలు వేధిస్తూనే ఉన్నాయి.

Sankranti Release: సీన్ రివర్స్.. పెద్ద పండగకి చిన్న సినిమాల హడావుడి!

ఏ మాత్రం ఛాన్స్ దొరికినా స్టార్ హీరోల సినిమాలకు భారీ ఆఫర్లు ప్రకటించి లాగేసుకుంటున్న ఓటీటీలు ఈసారి పాన్ ఇండియా సినిమాల మీద కూడా దృష్టి పెట్టాయి. రిలీజ్ అనుకున్న సమయానికి కనుక మళ్ళీ దేశంలో పరిస్థితిలు దారుణంగా మారి థియేటర్లు మూతపడితే రాధేశ్యామ్ వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అలా ఈసారి వాయిదా పడితే రెండు, మూడు నెలల పాటు రిలీజ్ కు అవకాశం ఉండకపోవచ్చని అంచనా. అందుకే ఓటీటీలు రాధేశ్యామ్ కు భారీ ఆఫర్ చేసినట్లుగా వినిపిస్తుంది.

Radhe Shyam: పండక్కి బొమ్మ పడుతుందా లేదా?.. కన్ఫ్యూజన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్!

రాధేశ్యామ్ డైరెక్ట్ ఓటీటీ విడుదలకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.400 కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఓటీటీలో విడుదల చేసే ఆలోచన మాత్రం మేకర్స్ కు లేదని తెలుస్తోంది. ఒకవేళ కరోనా ఆంక్షలు ఎక్కువై థియేటర్లు మూతపడితే.. ఓటీటీల నుండి రూ.450 కోట్ల నుండి రూ.500 కోట్ల ఆఫర్‌ వస్తే నేరుగా ఓటీటీలో విడుదల చేసే అవకాశం కూడా లేకపోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో.. అసలు థియేటర్లలో వస్తుందా మళ్ళీ వాయిదా పడుతుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.