Bhadrachalam: రామయ్య సన్నిధిలో అపదుద్ధారక స్తోత్ర పారాయణం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువై ఉన్న భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఆదివారం నుండి వైధిక కమిటీ అపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయనున్నారు. నేటి నుంచి జులై 9 వరకు ఈ అపదుద్ధారక స్తోత్ర పారాయణం నిర్వహించనున్నారు.

Bhadrachalam: రామయ్య సన్నిధిలో అపదుద్ధారక స్తోత్ర పారాయణం!

రామయ్య సన్నిధిలో అపదుద్ధారక స్తోత్ర పారాయణం!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువై ఉన్న భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఆదివారం నుండి వైధిక కమిటీ అపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయనున్నారు. నేటి నుంచి జులై 9 వరకు ఈ అపదుద్ధారక స్తోత్ర పారాయణం నిర్వహించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను ఎదుర్కోడానికి దైవ బలం తోడుగా ఉండాలని భావించిన వైధిక కమిటీ ఈ నెల 24న జ్యేష్ఠభిషేకం సందర్భంగా ఈ పారాయణాన్ని పఠించనున్నారు.

శ్రీ రామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో కరోనా ప్రారతోలాలనే సంకల్పంతో ఈ మహాత్కార్యాన్ని ఆలయ అధికారులు చేపట్టనున్నట్లు చెప్పారు. నేటి నుండి ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి ఉ.10 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ పారాయణం చేయనున్నారు. మొత్తం 27 రోజులు పాటు పారాయణ మహాత్కార్యం జరిపించనున్నారు.