Madhya Pradesh : డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఉన్న శిలాజాన్ని గుర్తించిన పరిశోధకులు
ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధకులు డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఉన్న శిలాజాన్ని మధ్యప్రదేశ్లో గుర్తించారు.
Madhya Pradesh : డైనోసార్..భారీ ఆకారంలో ఉండే ఈ జీవులు ఈ భూమ్మీద కొన్ని వేల సంత్సరాల క్రితం అంతరించిపోయాయి. కానీ వాటి అవశేషాలు మాత్రం ఈనాటికి వెలికితీస్తున్నారు పరిశోధకులు. అలా ఇప్పటికే డైనోసార్లకు సంబంధించిన ఎన్నో వింతలను..విశేషాలను భూమి పొరల నుంచి వెలికి తీసిన పరిశోధకులు మారో వింత విషయాన్ని కనుగొన్నారు. అది కూడా మన భారత్ లోనే కావటం విశేషం. ‘మధ్యప్రదేశ్ లో డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఉన్న శిలాజాన్ని’ పరిశోధకులు గుర్తించారు.
మధ్యప్రదేశ్లో ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధక బృందం జరుపుతున్న తవ్వకాల్లో అరుదైన శిలాజం బయటపడింది. డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఇమిడి ఉన్న శిలాజం ధార్ జిల్లా బాఘ్ ప్రాంతంలో పరిశోధకులు కనుగొన్నారు. ఇటువంటి గుడ్డు లభించడం డైనోసార్ శిలాజాల చరిత్రలో ఇదే తొలిసారి అని ఢిల్లీ యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు..వింతలు, విశేషాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. తాబేళ్లు, బల్లులు లేదా మొసళ్లు, పక్షులు రెంటిలో డైనోసార్లు వేటికి దగ్గరో తెలుసుకోవడంలో ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది అని పరిశోధకులు చెబుతున్నారు.
మధ్య భారతదేశంలోని ఎగువ క్రెటేషియస్ లామెటా నిర్మాణం డైనోసార్ శిలాజాలను (అస్థిపంజరం,గుడ్డు అవశేషాలు రెండూ) కనుగొనడంలో చాలా కాలంగా ప్రసిద్ధి చెందింది. పరిశోధకులు బాగ్ పట్టణానికి సమీపంలోని పడ్లియా గ్రామ సమీపంలో పెద్ద సంఖ్యలో టైటానోసౌరిడ్ సౌరోపాడ్ గూళ్ళను నమోదు చేశారు. ఈ గూళ్ళను అధ్యయనం చేస్తున్నప్పుడు..పరిశోధకులకు ఒక ‘అసాధారణ గుడ్డు’ కనిపించింది.
పరిశోధనా బృందం 10 గుడ్లతో కూడిన సౌరోపాడ్ డైనోసార్ గూడును కనుగొంది. ఇందులో అసాధారణమైన గుడ్డుతో సహా రెండు నిరంతర..గుండ్రటి ఎగ్షెల్ పొరలు విస్తృత గ్యాప్తో వేరు చేయబడ్డాయి. ఇది అండాశయం-ఇన్-ఓవో (ఒక గుడ్డు లోపల మరొక గుడ్డు) కనిపించింది.