Amavasya : అమావాస్య రోజున కొంతమంది విచిత్రంగా ప్రవర్తించటానికి కారణం ఏంటంటే?

మానసికంగా అసమతుల్యతతో ఉంటే, అమావాస్య నాడు మరింత అసమతుల్యతను అనుభవిస్తారు. ఈ రోజున, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి అన్నింటినీ పైకి లాగుతుంది. చంద్రుడిపై ఉండే అయస్కాంత శక్తి భూమిపై ఉండే సమస్త జీవరాశిని నియంత్రణలో ఉంచుతుంది.

Amavasya : అమావాస్య రోజున కొంతమంది విచిత్రంగా ప్రవర్తించటానికి కారణం ఏంటంటే?

amavasya

Amavasya : హిందూమతంలో అచారసాంప్రదాయాలు చాలా గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి అనే రెండు తిథులు కీలకమైనవి. పౌర్ణమిని శుభ సూచకంగా, అమావాస్యను అశుభ సూచకంగా చెప్తుంటారు. మరికొందరు మాత్రం అమావాస్య రోజునే మంచి రోజుగా భావిస్తుంటారు. కుటుంబానికి చెందిన పూర్వీకులు ఎవరైతే మరణించారో వారి ఆత్మలను స్మరించుకోవడానికి, వారిని పూజించడానికి అమావాస్య సరైన సమయంగా పరిగణిస్తారు. చంద్రకాంతి లేని రోజు సూర్యరశ్మి వారికి చేరుతుందని నమ్ముతారు. ఈ రోజున, మరణించిన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ పిల్లలు, వారసులను సందర్శిస్తారనే నమ్మకం కూడా ఉంది.

ప్రజలు అమావాస్యలో ప్రతిదీ విపరీతంగా భావిస్తారు. మానసికంగా అసమతుల్యతతో ఉంటే, అమావాస్య నాడు మరింత అసమతుల్యతను అనుభవిస్తారు. ఈ రోజున, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి అన్నింటినీ పైకి లాగుతుంది. చంద్రుడిపై ఉండే అయస్కాంత శక్తి భూమిపై ఉండే సమస్త జీవరాశిని నియంత్రణలో ఉంచుతుంది. ఆ అయస్కాంత శక్తి మన మెదడుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మానవ భావోద్వేగాలు, లక్షణాలు ఈ రోజు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. తలలో అధిక రక్త ప్రవాహం, శరీరంలో అధిక శక్తి ప్రవాహం ఈ ప్రభావానికి దారి తీస్తుంది. ఈ ప్రభావం వల్లే అమావాస్య రోజున కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమావాస్య రోజు రాత్రి అన్ని భావోద్వేగాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కొందరు వ్యక్తులు నియంత్రణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తారు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో కలిసి ఉంటారు. ఒక తిథికి, సూర్యుడు మరియు చంద్రుని మధ్య దూరం 12 డిగ్రీలుగా నిర్ణయించబడుతుంది. సాధారణంగా 0-12 డిగ్రీలను అమావాస్య అంటారు. మనం చంద్రుడిని మన మనస్సుగా, సూర్యుడిని మన ఆత్మగా భావిస్తే, మానవుని యొక్క అంతిమ లక్ష్యం రెండింటినీ ఒకచోట చేర్చడం. అమావాస్య నాడు, ఆకాశంలో సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు. మన మనస్సు , ఆత్మ కూడా ఒకదానికొకటి కలిసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా, మనస్సు, ఆత్మ ఒకదానికొకటి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన శరీరంలోని అసాధారణ కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి. అమావాస్య దశలో మనస్సు, ఆత్మ డిస్‌కనెక్ట్ అయిన వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఆత్మ,మనస్సు సమలేఖనం చేయబడిన అమావాస్యరోజు రాత్రి సమయంలో అధిక శక్తులను పొందాలని లక్ష్యంగా పెట్టుకుని క్షుద్రపూజలు, చేతబడి వంటి వాటిని సాగిస్తుంటారట.

అమావాస్య రోజున అతీంద్రియ శక్తులు తిరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే అమావాస్య రోజున క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తుంటారు. అమావాస్యను కీడుగా భావిస్తారు. అమావాస్య రోజున కొత్త బట్టలు కట్టుకోవడం, కొత్త పనిని మొదలు పెట్టడం, క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయడం నిషిద్ధమని మన పెద్దలు చెబుతుంటారు. అమావాస్య రోజున చాలా మంది దుర్గామాత, నరసింహ స్వామి, హనుమంతుడు, శని దేవతలను పూజిస్తారు, దుష్టశక్తులు,ఇతర ఖగోళ సమస్యల నుండి బయటపడటానికి పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రోజులో ఎటువంటి శుభ కార్యాలు నిర్వహించరు. కొందరు వ్యక్తులు ఈ రోజు అశుభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణం కూడా చేయరు. అదే క్రమంలో నవజాత శిశువులు కూడా అమావాస్య సమయంలో ప్రబలంగా ఉన్న శక్తులచే ప్రభావితమవుతారట.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల నుండి సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే.