వ్యవసాయం చేస్తూ.. ఆదర్శంగా నిలిచిన హీరోయిన్!

ప్రముఖ నటుడు అరుణ్ పాండియన్ కూతురు కీర్తి పాండియన్ వ్యవసాయం చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : May 8, 2020 / 08:37 AM IST
వ్యవసాయం చేస్తూ.. ఆదర్శంగా నిలిచిన హీరోయిన్!

ప్రముఖ నటుడు అరుణ్ పాండియన్ కూతురు కీర్తి పాండియన్ వ్యవసాయం చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి..

లాక్‌డౌన్ టైమ్ సామాన్యులకంటే సెలబ్రిటీలకు బాగా ఉపయోగ పడుతుంది. ఇన్నాళ్లూ చేద్దామనుకుని చేయలేని పనులు, నేర్చుకోవాల్సిన విషయాలు, చదవాల్సిన పుస్తకాలు, చూడాల్సిన సినిమాలు.. ఇలా ఫుల్ ప్యాక్ అయిపోయింది వారి టైమ్ టేబుల్. ఇలాంటి సమయంలో ప్రముఖ నటుడు అరుణ్ పాండియన్ తనయ కీర్తి పాండియన్ వ్యవసాయం చేస్తోంది. తమిళ నాట ‘తుంబ’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులు ఆగిపోవ‌డంతో సొంతూరుకు వెళ్లిన కీర్తి వ్యవసాయ పనులు ప్రారంభించింది. ట్రాక్ట‌ర్‌తో పొలం దున్నింది. స్వయంగా పొలంలోకి దిగి నాట్లు వేసింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రైతుగా మారి ఆమె అందరికీ గొప్ప సందేశాన్ని ఇచ్చిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు పలు ఛాలెంజ్‌ల పేరిట సెలబ్స్ వీడియోలు పోస్ట్ చేస్తుండగా, ఇవి అందరూ చేసే పనులే కదా, మీరు రైతులకు సాయం చేశారా, పోనీ పొలంలోకి దిగి వ్యవసాయం చేశారా? అంటూ నెటిజన్లు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కీర్తి ఆ పని చేసి చూపించడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.

More: 

స్నేహితుణ్ణి గుర్తు చేసుకుంటూ సుకుమార్ ఎమోషనల్ పోస్ట్

అలా నాగ్, అన్నగారి డ్రెస్ వేసుకోవడం జరిగింది!