Anasuya : మీలా పనీపాట లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్ వచ్చింది.. మళ్ళీ ట్విట్టర్లో అనసూయ రచ్చ..

గొడవ ముగిసింది అనుకునేలోపు మళ్ళీ ఇటీవల.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, ట్రోల్స్ చేసే వాళ్ళ పని చెప్తారు, పోలీసులు దీనిపై పని చేస్తున్నారు అంటూ మరో ట్వీట్ పెట్టింది అనసూయ. దీంతో మరోసారి ట్విట్టర్లో రచ్చ.............

Anasuya : మీలా పనీపాట లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్ వచ్చింది.. మళ్ళీ ట్విట్టర్లో అనసూయ రచ్చ..

Anasuya counters to netizens again

Anasuya :  యాంకర్ అనసూయ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ట్రై చేస్తుంది. ఏదో ఒక ట్వీట్ చేసి, ఏదో ఒక కామెంట్ చేసి, లేదా తన హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది అనసూయ. ఇటీవల ఆంటీ అంటే పోలీసు కేసు పెడతాను అని చెప్పి ట్విట్టర్ లో పెద్ద రచ్చకి తెరలేపింది. ఏకంగా నెటిజన్లు ఆంటీ అని ఇండియా వైడ్ ట్రెండ్ చేశారు. నెటిజన్లు చేసిన చాలా ట్వీట్స్ కి అనసూయ కౌంటర్లు ఇస్తూ రిప్లైలు ఇచ్చింది.

గొడవ ముగిసింది అనుకునేలోపు మళ్ళీ ఇటీవల.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, ట్రోల్స్ చేసే వాళ్ళ పని చెప్తారు, పోలీసులు దీనిపై పని చేస్తున్నారు అంటూ మరో ట్వీట్ పెట్టింది అనసూయ. దీంతో మరోసారి ట్విట్టర్లో రచ్చ మొదలైంది. ఓ నెటిజన్ దీనికి రిప్లై ఇస్తూ.. నీలాగా మాకు పని పాట లేదని పోలీసులు పంపించేశారంటగా అని కామెంట్ చేయగా దానికి అనసూయ కౌంటర్ ట్వీట్ ఇస్తూ.. ”లేదండీ మీలా పనీపాటా లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్‌ వచ్చిందని చెప్పారండి. మీకు నోరు జారటంలో తొందర ఎలా ఉందో బోల్తా పడటానికి కూడా తొందర కదా. కాస్త ఓపిక పట్టండి. అన్నీ జరుగుతాయ్‌.. జరుగుతున్నాయ్‌” అని రిప్లై ఇచ్చింది. దీంతో మరోసారి అనసూయ ట్వీట్ వైరల్ గా మారింది.

Venu Udugula : విరాటపర్వం దర్శకుడితో నాగచైతన్య సినిమా..? చైతూ ఆల్రెడీ కథ కూడా వినేశాడట..

అసలిదంతా అనసూయనే మొదలుపెట్టిందని, మళ్ళీ ఇప్పుడు తనే వేరే వాళ్ళు తప్పు చేస్తున్నారంటూ ట్వీట్స్, కౌంటర్లు వేస్తుంది అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మరోసారి ట్విట్టర్లో పెద్ద రచ్చకు తెరలేపేలా ఉంది అనసూయ. కంప్లైంట్ ఇచ్చాను, పని జరుగుతుందని అనసూయ చెప్పినా ఇప్పటిదాకా పోలీసులు మాత్రం దీనిపై బయటకి స్పందించలేదు.