Mahesh Babu : SSMB28 చిత్ర యూనిట్‌కి ఇంటి వంట రుచి చూపిస్తున్న నమ్రతా..

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం 'SSMB28'. పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ.. షూటింగ్ జరుపుకోడానికి మాత్రం అనేక సమస్యలు ఎదురుకుంటుంది. తాజాగా SSMB28 టీమ్ స్పెషల్ డిన్నర్ లో పాల్గొన్నారు. మహేష్ బాబు సతీమణి...

Mahesh Babu : SSMB28 చిత్ర యూనిట్‌కి ఇంటి వంట రుచి చూపిస్తున్న నమ్రతా..

Namrata showing homemade meal taste for SSMB28 film unit

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం ‘SSMB28’. పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ.. షూటింగ్ జరుపుకోడానికి మాత్రం అనేక సమస్యలు ఎదురుకుంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. మళ్ళీ సెట్స్ కి ఎప్పుడు వెళ్ళేది అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతుంది.

Mahesh Babu : రియల్ లైఫ్‌లోను ‘బిజినెస్ మేన్’ అనిపించుకుంటున్న మహేష్ బాబు..

మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడం, ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్దేకి కూడా గాయం అవ్వడంతో సినిమా సెట్స్ పైనే నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక షూటింగ్ కి బ్రేక్ రావడంతో దర్శకుడు త్రివిక్రమ్ కథకు ఇంకాస్త మెరుగులు దిద్దే పనిలో పడ్డాడట. తాజాగా SSMB28 టీమ్ స్పెషల్ డిన్నర్ లో పాల్గొన్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రతా చిత్ర యూనిట్‌కి ఇంటి వంట రుచి చూపించింది.

ఈ విందుకు దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరియు మెహర్ రమేష్ కూడా హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నమ్రతా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్న చిత్ర యూనిట్, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి.. హైదరాబాద్ శివార్లలోని ఖాన్‌పూర్‌లో చిత్రీకరణ జరుపుకొనునట్లు తెలుస్తుంది.