తుదిశ్వాస వరకు నవ్వుతూనే ఉన్నారు.. ఏడిపిస్తూ వెళ్లిపోయారు.. భావోద్వేగానికి గురైన కపూర్ కుటుంబం..

పూర్తయిన రిషి కపూర్ అంత్యక్రియలు.. భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు..

  • Published By: sekhar ,Published On : April 30, 2020 / 05:31 PM IST
తుదిశ్వాస వరకు నవ్వుతూనే ఉన్నారు.. ఏడిపిస్తూ వెళ్లిపోయారు.. భావోద్వేగానికి గురైన కపూర్ కుటుంబం..

పూర్తయిన రిషి కపూర్ అంత్యక్రియలు.. భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు..

బాలీవుడ్ సీనియర్ నటులు రిషి కపూర్ (67) ఈరోజు(గురువారం) ఉదయం 8గంటల 45నిమిషాలకు కన్నుమూశారు. రెండేళ్లుగా లుకేమియా‌తో బాధపడుతున్న రిషి కపూర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. చివరి నిమిషం వరకు ఆయన నవ్వుతూ, నవ్విస్తూ గడిపారని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అమెరికాలో కేన్సర్ చికిత్స పూర్తి చేసుకుని గతేడాది సెప్టెంబర్‌లోనే రిషీ భారత్‌కు తిరిగి వచ్చారు.

Rishi Kapoor

ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రిషీకపూర్ ఈ నెల రెండో తేదీ నుంచి కొత్త పోస్టులు చేయలేదు. ఈ సాయంత్రం రిషి కపూర్ అంత్యక్రియలు ముగిసినట్లుగా కపూర్ ఫ్యామిలీ తెలియజేసింది. ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియలకు అతికొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా చివరి వరకు నవ్వుతూనే ఉన్నారు.. ఇప్పుడు మమ్మల్ని అందర్నీ ఏడిపిస్తూ వెళ్లిపోయారు.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు కపూర్ కుటుంబ సభ్యులు.. 

Rishi Kapoor