VH On Pm Modi : మరోసారి మోదీ వస్తే వాళ్లను కోటీశ్వరులను చేస్తారు- వీహెచ్ ఫైర్

దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. బీజేపీ మీడియా పబ్లిసిటీ కోసం అసత్య ప్రచారం చేసుకుంటోంది.

VH On Pm Modi : మరోసారి మోదీ వస్తే వాళ్లను కోటీశ్వరులను చేస్తారు- వీహెచ్ ఫైర్

VH On Pm Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 లక్షల మందిని పైకి తీసుకొచ్చామని మోదీ అంటున్నారు.. అదే నిజమైతే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? అని వీహెచ్ ప్రశ్నించారు. ఈ పదేళ్లలో మోదీ ఏం చేశారో చెప్పడానికి ఏమీ లేదని విమర్శించారు. మరోసారి మోదీ వస్తే.. అదానీ, అంబానీలను కోటీశ్వరులు చేస్తాడు తప్ప.. పేదలకు ఏమీ చేయరు అని వీహెచ్ అన్నారు. కాగా.. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో విఫలం అవుతున్నాం అని వీహెచ్ వాపోయారు.

”రాహుల్ గాంధీ కులగణన చేపడతాం అంటున్నారు. ఓబీసీని సపరేట్ చేసింది రాహుల్ గాంధీ. దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. ఆంధ్రలో ఇమామ్ లకు 5 వేల పెన్షన్ అంటున్నారు. ఇక్కడున్న వాళ్ళు ముస్లింలు కాదా ..? స్వాతంత్ర్యం తెచ్చింది మహాత్మా గాంధీ. బీజేపీ మీడియా పబ్లిసిటీ కోసం అసత్య ప్రచారం చేసుకుంటోంది” అని వీహెచ్ మండిపడ్డారు.

Also Read : ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు