ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి.. అధికార బీజేపీ పార్టీకి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు

Minister Komatireddy Venkat Reddy

Minister Komatireddy Venkat Reddy : దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి.. అధికార బీజేపీకి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమాజికగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. రెండు సార్లు బ్లాక్ మనీ తెస్తామని ఎన్నికల్లో గెలిచిన మోదీ.. ఈసారి రాముని జపం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మోదీ పదేళ్ల పాలనలో అదానీ, అంబానీ చేతుల్లో దేశ సంపద ఉంది. జీఎస్టీ రూపంలో భారీ మోసం జరుగుతుందని అన్నారు. ఓట్ల కోసమే బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేయాలనుకుంటుంది. మరోసారి మోదీ ప్రధాని అయితే ఇక ఎన్నికలు జరగకుండా శాశ్వత ప్రధానమంత్రిగా ప్రకటించుకుంటాడంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Also Read : తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి.. సంజయ్ విజయం ముందే నిర్ణయమైంది : ప్రధాని మోదీ

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎన్నిరోజులైంది? మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం మాపై రాజకీయ విమర్శలు మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త టెండర్ పిలవలేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. ఇవన్నీ మోదీకి కనపడడం లేదా? మాది ఆర్ఆర్ కాదు.. మీది డబుల్ ఏ.. పదేళ్లలో డబుల్ ఎ అదానీ, అంబానీ బాగుపడ్డారంటూ కోమటిరెడ్డి అన్నారు. నార్త్ ఇండియాలో బీజేపీపై వ్యతిరేకత ఉంది. అందుకే సౌత్ ఇండియాలో సీట్లకోసం మోదీ రాజకీయ విమర్శలు చేస్తున్నారంటూ కోమటిరెడ్డి అన్నారు.

Also Read : BJP MLC Candidate : ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

నేను ఏ రైతును విమర్శించలేదు. రైతులంటే నాకు ప్రేమ. నేను రైతును తిట్టినట్లు నిరూపిస్తే ఏ నిర్ణయంకు అయినా సిద్ధం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కేసీఆర్ అబద్దాలు రామాయణం కంటే పెద్దగా ఉంది. డిపాజిట్ల కోసమే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ రెండు రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలి. ఏపీలో పార్టీ నష్టపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంను సోనియా గాంధీ ఇచ్చారు. ఏపీలో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవదని మంత్రి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు.