Neelakurinji flowers : 12ఏళ్లకు ఒక్కసారి పూసే నీలకురుంజి పూలని చూడాలని 87 ఏళ్ల తల్లి కోరిక..2 కిలోమీటర్లు మోస్తూ.. తీసుకెళ్లి చూపించిన కొడుకులు

12ఏళ్లకు ఒక్కసారి పూసే నీలకురుంజి పూలని చూడాలని 87 ఏళ్ల తల్లి కోరిక..2 కిలోమీటర్లు మోస్తూ.. తీసుకెళ్లి చూపించిన కొడుకులు

Neelakurinji flowers : 12ఏళ్లకు ఒక్కసారి పూసే నీలకురుంజి పూలని చూడాలని 87 ఏళ్ల తల్లి కోరిక..2 కిలోమీటర్లు మోస్తూ.. తీసుకెళ్లి చూపించిన కొడుకులు

Neelakurinji flowers

Neelakurinji flowers : ప్రకృతి ప్రేమికుల 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. మరోసారి నూలకురింజి పువ్వులు విరగబూసి ప్రకతి ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ ఏడాది కూడా నీలకురింజి పువ్వులు విరగబూశాయి. నీలిరంగుతో మిలమిలా మెరిసిపోయే నీలకురింజి పువ్వుల అందాలు చూసి తీరాలే గానీ వర్ణించటానికి వీలు లేని అందం..సొగసు..మృగ్ధ మనోహర రూపం వాటిది. కొండలపై పూసిన ఈ నీలకురింజి పువ్వులతో కేరళలోని ఇడుక్కిల్లోని ఉన్న శలోం కొండలు నీలం రంగు తివాచీ పరిచినట్లుగా ఉన్నాయి. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూజీ ఈ నీలకురింజి పువ్వులను చూడటానికి ప్రకృతి ప్రేమికులతో పాటు పర్యాటకులు కూడా భారీగా వస్తుంటారు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మాత్రమే పూసే ఈ నీలకురింజి పువ్వులను చూడటానికి ఈ ఏడాది కర్ణాటకతో పాటు కేరళ,తమిళనాడులకు కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు.

Neelakurinji Bloom

12ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూసే ఈ నీలకురింజిలను జీవితంలో ఒక్కసారి అయినా చూసి తీరాల్సిందే. అదే అనుకున్నారు కేరళకు చెందిన 87 ఏళ్ల మహిళ. అడవుల్లో ఎత్తైన కొండలమీద విరబూసే ఈ పువ్వులను చూడడానికి ఆమె వయసు, ఆరోగ్యం రెండు సహకరించవు. కానీ నీలకురింజిలను చూడాలనే తపన ఆమెలో ఉంది. దీంతో నీలకురింజి పుల్వులను కూడాలని ఉందని తన కొడుకులతో తన ఆకాంక్షను తెలిపారు. దానికి ఆ కొడుకులు ఈ వయస్సులే ఏంటమ్మా అని అనలేదు. తప్పకుండానమ్మా అంటూ శలోం కొండలకు తీసుకెళ్లారు తల్లి. వాహనం వెళ్లినంత దూరం వెళ్లగా కొండలపైకి తల్లిని చేతులపై మోసుకుంటూ తీసుకెళ్లారు. ఆ కొండపై కూర్చుని నీలకురింజి పువ్వుల అందాలను చూస్తూ ఆ తల్లి మైమరిపోయింది. తల్లి కళ్లల్లో ఆనందాన్ని..నీలకురించి పువ్వుల అందాలను చూసి ఆ కొడుకులు పరవశించిపోయారు.

Neelakurinji Bloom

కొట్టాయం జిల్లాలోని ముట్టుచిరాకు చెందిన 87 ఏళ్ల ఎలికుట్టి పాల్ అనే మహిళ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. పొరుగు జిల్లా ఇడుక్కిలో వికసించిన అరుదైన పువ్వులను చూడాలని ఆశపడ్డారామె. అదే విషయాన్ని కొడుకులతో చెప్పారు.తల్లి కోరికను తీర్చడం కోసం మరో ఆలోచన లేకుండా.. ఆమె కొడుకులు రోజన్, సత్యన్ ఆమెను జీపుపై ఎక్కించుకుని దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి మున్నార్ సమీపంలోని కల్లిపారా కొండలకు చేరుకున్నారు.

అరుదైన నీలకురింజి పువ్వుల విశేషం ఏమిటంటే.. ఇవి భారతదేశంలోనే పూస్తాయి. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇవి పూయవు. కేరళలో కూడా కొన్ని ప్రాంతాలలోనే దర్శనమిస్తాయి. అందమైన, అద్భుతమైన, అరుదైన పువ్వు “నీలకురింజి” పువ్వు పేరుతో కూడా ఒక దేవాలయం ఉంది.

అయితే అక్కడికి చేరుకున్న తర్వాత కొండపైకి వాహనం వెళ్లటం సాధ్యంకాదు. కాలి నడక తప్ప కొండలపైకి వెళ్లటానికి మరో దారిలేదు.దీంతో తల్లి కోరిన కోర్కెను ఎలాగైనా తీర్చాలని ఇద్దరు కొడుకులు ఏమాత్రం ఆలోచించలేదు. అమ్మను తమ భుజాలపై ఎత్తుకుని 1.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి కొండపైకి తీసుకుని వెళ్లారు. ఆ కొండ నీలకురింజి పూలతో ఊదారంగు దుప్పటిలా మారింది.దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో శలోం అడవుల్లోను కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే నీలకురంజి.. గుబురు పొదకు చెందిన చిన్న మొక్క. నీలి రంగులో ఉండే ఈ పువ్వుల సోయగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..

ఈ పువ్వులను చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అంత అందం వీటి సొంతం. అందుకనే ప్రకృతి ప్రేమికులు ఈ పువ్వులు వికసించే సమయం కోసం 12 ఏళ్ళు ఎదురుచూస్తారు. అవి విరిసాయి అని తెలియగానే రెక్కలు కట్టుకుని కొండలపై వాలిపోతారు. అత్యంత ప్రసిద్ధి చెందిన నీలకురింజి వికసించే ప్రదేశం ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్. ఇక్కడ చివరిసారిగా 2018లో కేరళ వరదలు సంభవించిన సమయంలో నీలకురింజి వికసించాయి. తిరిగి ఈ ఏడాది కల్లిపారా కొండలలో 10ఎకరాలకుపైగా ప్రాంతంలో నీలకురింజి పువ్వులు విరబూశాయి. మళ్ళీ మున్నార్‌లో తదుపరి నీలకురింజి పుష్పించేది 2030లో మాత్రమే.

ఈ అరుదైన దృగ్విషయాన్ని చూసేందుకు మీరు 2030 వరకు వేచి ఉండాలా అని భావించే ప్రకృతి ప్రేమికులు చింతించకండి. 2018 నుండి నీలకురింజి తమిళనాడులోని కొడైకెనాల్, కర్ణాటకలోని కొడగు, కేరళలోని పూప్పరలో వికస్తున్నాయి. ఈ ఏడాది కర్ణాటకలోని చిక్కమగళూరు, కేరళలోని కల్లిపర ప్రాంతాల్లో నీలకురింజి వికసించాయి.

ఈ అరుదైన పువ్వులను చూసేందుకు మీరు 2030 వరకు వేచి ఉండాలా అని భావించే ప్రకృతి ప్రేమికులకు ఓ గుడ్ న్యూస్. 2018 నుండి నీలకురింజి తమిళనాడులోని కొడైకెనాల్, కర్ణాటకలోని కొడగు, కేరళలోని పూప్పరలో వికస్తున్నాయి. ఈ ఏడాది కర్ణాటకలోని చిక్కమగళూరు, కేరళలోని కల్లిపర ప్రాంతాల్లో నీలకురింజి వికసించాయి.

దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో షోల అడవుల్లో మాత్రమే కనిపించే నీలకురంజి.. గుబురు పొదకు చెందిన చిన్న మొక్క. నీలి రంగులో ఉండే ఈ పువ్వుల సోయగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..

అరుదైన నీలకురింజి పువ్వులు భారతదేశంలోనే మాత్రమే పూస్తాయి. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇవి పూయవు. కేరళలో కూడా కొన్ని ప్రాంతాలలోనే దర్శనమిస్తాయి. అందమైన, అద్భుతమైన, అరుదైన పువ్వు “నీలకురింజి” పువ్వు పేరుతో కూడా ఒక దేవాలయం ఉంది. ఈ నీలకురింజి పువ్వుల పరాగసంపర్కానికి చాలాకాలం అవసరం. అందుకే ఇవి వికసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు ఈ నీల‌కురింజి మొక్క‌లు జీవితకాలంలో ఒక్క‌సారే పూస్తాయి. మొక్క‌లు మొలకెత్తిన త‌ర్వాత‌ 12 ఏండ్లకు పూత‌పూసి, ఆ త‌ర్వాత‌ ఎండిపోతుంది. ఆ మొక్క నుంచి రాలిన విత్త‌నాల నుంచి మ‌ళ్లీ మొక్క‌లు మొలిచి 12 ఏండ్ల‌కు పూత‌పూస్తాయి. అందుకే  ఈ నీలకురింజి పువ్వులు వికసించటానికి 12 ఏళ్లు పడుతుంది.