గడ్డివాములో చెలరేగిన మంటలు..ముగ్గురు చిన్నారులు సజీవ దహనం
ఒడిశా కలహండి జిల్లాలోని బిజ్మారా గ్రామంలో ఓ గడ్డివాములో మంటలు చెలరేగి..అక్కడే ఆడుకుంటున్నా ముగ్గురు బాలికలు సజీవ దహనమైపోయారు.
శనివారం (నవంబర్ 31) జరిగిన ఈ దుర్ఘటనలో చనిపోయిన బాలికలు నాలుగు ఐదు సంవత్సరాల వారే. వారిలో డీజీ, రోజీ అనే ఇద్దరు చిన్నారులు కవలపిల్లలు. మరో చిన్నారి రాచన్ రూట్.
గడ్డివాములో మంటలు చెలరేగినట్లుగా గుర్తించిన స్థానికులు వెంటనే మంటల్ని ఆర్పారు. వెంటనే చిన్నారుల్ని కోక్సర కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అప్పటికే వారు 80 నుంచి 90 శాతం వరకూ కాలిపోడటంతో పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భవానిపటన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో దారిలోనే ఒక చిన్నారి మరణించింది. మరో ఇద్దరు భవానీపటన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
హాస్పిటల్ కు తీసుకు వచ్చేసరికే బాలికల పరిస్థితి విషమించిందనీ భవానీ పటన హాస్పిటల్ డాక్టర్ నారాయణ్ తెలిపారు. అనంతరం చిన్నారుల మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని డాక్టర్ తెలిపారు.
Odisha: Three minor girls were charred to death yesterday while they were playing near a haystack that caught fire, at Bijmara village in Kalahandi district. pic.twitter.com/4GhjtnjG7i
— ANI (@ANI) November 30, 2019