Home » Telangana
మేధావులు ఆలోచించాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దేశం నాశనమైంది. రూపాయి విలువ పతనమైంది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదు.
ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉన్నవే. ఇప్పటివరకు వీటన్నింటిని బీజేపీ అమలు చేసింది. ఇక మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడమే.
ఈ ప్రభుత్వం పడిపోతుందని పనిగట్టుకుని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలని సూచించారు.
ఈ ప్రభుత్వం పడిపోతుందని విపక్షాలు దుఫ్ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయి.
ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో నిజామాబాద్ రైతులను చూసి నేర్చుకుంటారు. నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి.
దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. బీజేపీ మీడియా పబ్లిసిటీ కోసం అసత్య ప్రచారం చేసుకుంటోంది.
రేపు జరగబోయేది ఎన్నికలు కాదు యుద్ధం. ఈ యుద్ధంలో కాకతీయుల పౌరుషాన్ని చాటాలి
బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.