Sabarimala Special Trains: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 38ప్రత్యేక రైళ్లు..
అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది.
Sabarimala Special Trains: అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో శమరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.
– డిసెంబర్ 5, 12, 19, 26 తేదీలతో పాటు జనవరి 2,9, 16 తేదీల్లో హైదరాబాద్ – కొల్లాంకు, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో, జనవరి 3, 10, 17 తేదీల్లో కొల్లాం – హైదరాబాద్ కు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
– డిసెంబర్ 2, 9, 16, 30 తేదీల్లో, జనవరి 6, 13 తేదీల్లో నర్సాపూర్ – కొట్టాయంకు, డిసెంబర్ 3, 10, 17, 24 తేదీల్లో, జనవరి 7, 14 తేదీల్లో కొట్టాయం నుంచి నర్సాపూర్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
– డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో, జనవరి 1,8 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కొట్టాయంకు వరకు. అదేవిధంగా డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో, జనవరి 2, 9 తేదీల్లో కొట్టాయం నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.