YS Sharmila : హోంగార్డు రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం : వైఎస్ షర్మిల
ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

YS Sharmila (7)
YS Sharmila – KCR : కేసీఆర్ నియంత పాలనలో మరో నిండు ప్రాణం బలైపోయిందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. హోంగార్డు రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినా కేసీఆర్ కు హోం గార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న మనసు లేకపోవడం బాధాకరం అన్నారు. పాతబస్తీకి చెందిన హోం గార్డు రవీందర్ సకాలంలో జీతం అందక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లన్నారు, హెల్త్ కార్డులన్నారు, జీతాలు పెంచుతామని ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. హోం గార్డుల జీవితాలు మారుస్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ 2017లో హామీ ఇచ్చినా నేటికీ చేయలేదని విమర్శించారు. సమయానికి జీతాలు రావు, కనీస గౌరవం లేదన్నారు.
Ys Sharmila: దొంగమాటలు చెప్పడానికి దొరకు సిగ్గుండాలి: షర్మిల ఆగ్రహం
‘నీ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలి దొరా’ అని కేసీఆర్ ను ఉద్ధేంచి వ్యాఖ్యనించారు. హామీ ఇచ్చిన విధంగా 20 వేల మంది హోంగార్డులను తక్షణమే పర్మినెంట్ చేసి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.