Errabelli Dayakar Rao : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్టరీ.. ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు

సిఫార్స్ లేఖలపై ఆరా తీయగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ పాషా, గుంటి శేఖర్ మంత్రి ఎర్రబెల్లి పేరుతో సిఫార్స్ లేఖలు తయారు చేసినట్లు తేలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్ ను తయారు చేశారు.

Errabelli Dayakar Rao : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్టరీ.. ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు

Minister Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao Signature Forged : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకం ఫోర్టరీ చేసిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ మంత్రి ఎర్రబెల్లి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్ తో బోగస్ సిఫార్స్ లేఖ తయారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఇటీవల పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో కొన్ని సిఫార్సు లేఖలు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి సిఫార్స్ లేఖలు తమకు రాలేదని, అధికారులు ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.

Telangana Politics: మేం సహకరించం.. తెల్లం వెంకట్రావుపై ఐదు మండలాల బీఆర్ఎస్ నేతల అసంతృప్తి.. 50 కార్లతో భారీ ర్యాలీగా…

సిఫార్స్ లేఖలపై ఆరా తీయగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ పాషా, గుంటి శేఖర్ మంత్రి ఎర్రబెల్లి పేరుతో సిఫార్స్ లేఖలు తయారు చేసినట్లు తేలింది.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్ ను తయారు చేశారు.

మంత్రి ఎర్రబెల్లి సంతకాన్ని ఫోర్జరీ చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సిఫార్సు లేఖలను పంపినట్లు తేలింది. ఈ మేరకు మంత్రి ఓఎస్డీ డా.రాజేశ్వర్ రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు గౌస్ పాషా, గుంటి శేఖర్ పై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.