Ganji Prasad Murder Case
Ganji Prasad murder case : వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు సంబంధించి మొత్తం 12మందిపై కేసు నమోదు చేశామని నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ శర్మ వెల్లడించారు. గంజి ప్రసాద్ హత్యకు ఆధిపత్య పోయే కారణమని..నిందితులు మూడు రోజులు రెక్కీ నిర్వహించారని.. ఈ కేసులో ప్రధాన నిందితుడు బజారయ్యను ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు. హత్య కోసం సురేష్ అనే వ్యక్తి ఏప్రిల్ 26న కత్తులు సమీకరించాడని బజారయ్య ప్రోద్బలంతోనే ముగ్గురు కలిసి హత్య చేశారని తెలిపారు. గంజి ప్రసాద్ ను హత్య చేయటానికి పక్కా ప్లాన్ తోనే మూడు రోజులు రెక్కి నిర్వహించారని తరువాత అదను చూసి హత్య చేశారని తెలిపారు.గంజి ప్రసాద్ కదలికలను నాగార్జున గమనిస్తుండేవాడని..అలా మిగిలిన ఇద్దరికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేవాడని తెలిపారు. గంజి ప్రసాద్ హత్య కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని..విచారణ తరువాత మిగిలిన వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
Read More : Andhra Pradesh : YCP నాయకుడు హత్య..పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల దాడి
ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మీద చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రామంలో జరిగిన గొడవలు, ఘర్షణలకు సంబంధించి ఎస్సై చర్యలు తీసుకోలేదని ఎస్పీ తెలిపారు. దీంట్లో భాగంగానే ఎస్సైని సస్పెండ్ చేశామని చెప్పారు. గ్రామంలో ఆధిపత్యపోరే హత్యకు కారణమని ఎస్పీ వెల్లడించారు. ఎంపీటీసీ బజారయ్య ఓకే అన్న తర్వాతే సురేష్ కత్తులు తీసుకొచ్చాడని రాహుల్ దేవ్ అన్నారు. గంజి ప్రసాద్ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. వీరందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. అనంతరం జైలుకు పంపుతామని ఆయన పేర్కొన్నారు.
Read More : G Kothapalli : జి.కొత్తపల్లిలో హై టెన్షన్.. పోలీసుల రక్షణలో ఎమ్మెల్యే తలారీ
వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. శనివారం ద్వారకా తిరుమలలోని జి. కొత్తపల్లి వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఏ1 గా బజారయ్య ఉన్నాడు. గంజి ప్రసాద్ గతంలో టీడీపీలో ఉండేవాడు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరాడు. టీడీపీలో ఉన్న సమయంలో ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత అనుచరుడిగా ఉన్నాడు. తానేటి వనిత గతంలో గోపాలపురం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ గంజి ప్రసాద్ టీడీపీలోనే కొనసాగుతూ..గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరాడు.
Also read : Eluru : జి. కొత్తపల్లిలో కత్తులాట.. గంజి ప్రసాద్ను ఎందుకు చంపారు ? సంచలన విషయాలు
గంజి ప్రసాద్ వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో బజారయ్యకు, గంజి ప్రసాద్ కు మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. శనివారం జి.కొత్తపల్లికి సమీపంలోనే గంజి ప్రసాద్ ను ప్రత్యర్ధులు బైక్ పై వచ్చి హత్య చేశారు. ఈ విషయం తెలిసి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కూడా గ్రామస్తులు దాడి చేశారు. గంజి ప్రసాద్ హత్య కేసులో ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య హస్తం ఉందని పోలీసులకు కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. హత్య అనంతరం గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను ఏపీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గంజి ప్రసాద్ కుటుంబాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఆదుకొంటామని తానేటి వనిత పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.