టీడీపీ కార్యకర్త అవినాష్ అరెస్ట్: జగన్పై నారా లోకేష్ ఆగ్రహం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవ్వగా.. వీడియో చేసిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నగరంలో ఉంటున్న అవినాష్ను బుధవారం(08 జనవరి 2020) అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
ధూళిపాళ్ల అవినాష్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతడు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ టిక్ టాక్లో ఓ వీడియో చేశాడు. ఎమ్మెల్యేపై అవినాష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మాచర్ల పోలీసులు హైదరాబాద్లో ఉన్న అతడిని అరెస్ట్ చేశారు.
ఈ విషయంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభిమాని అవినాష్ అక్రమ అరెస్ట్ని తీవ్రంగా ఖండించారు. అవినాష్ తో సహా టీడీపీ సోషల్ మీడియా వాలంటీర్లకు అండగా ఉంటానన్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తూ భావ ప్రకటనా స్వేచ్చని అణిచివేస్తూ పోలీసులు వ్యవహరించడం మానవ హక్కులు హరించడమేనని అన్నారు.
తప్పుడు కేసులతో వైసీపీ నాయకులకు తొత్తులుగా మారుతున్న పోలీసులు చేసిన ప్రతి తప్పుకి న్యాయ స్థానాల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు బూతులు మాట్లాడే హక్కు కల్పిస్తూ ప్రత్యేక చట్టం ఏమైనా తీసుకొచ్చారా? అంటూ జగన్ని ప్రశ్నించారు. వైసీపీ నేతలు బరి తెగించి, హద్దు మీరి రైతులను, మహిళల్ని, ప్రతిపక్ష నాయకులని బండ బూతులు తిట్టినా కేసులు ఉండవని.. తాము ఫిర్యాదు చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ, కేసు నమోదు చెయ్యలేము అని సెలవిస్తున్న పోలీసులు.. చట్టం అందరికి సమానమే అనే విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు.
టీడీపీ అభిమాని అవినాష్ అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అవినాష్ తో సహా టీడీపీ సోషల్ మీడియా వాలంటీర్లకు అండగా నేనుంటాను. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తూ భావ ప్రకటనా స్వేచ్చని అణిచివేస్తూ పోలీసులు వ్యవహరించడం మానవ హక్కులు హరించడమే.(1/4) pic.twitter.com/7oKMXRE7GK
— Lokesh Nara (@naralokesh) January 9, 2020