AP Corona Cases : ఏపీలో కొత్తగా 2,287 కరోనా కేసులు.. 18 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,287 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 18 మంది మృతి చెందారు. 2,430 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సంఖ్య 19,68,462కు చేరింది.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 2,287 కరోనా కేసులు.. 18 మంది మృతి

Ap Corona Cases (3)

Updated On : August 1, 2021 / 6:11 PM IST

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,287 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 18 మంది మృతి చెందారు. 2,430 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సంఖ్య 19,68,462కు చేరింది.

ప్రస్తుతం 21,019 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా ఇప్పటివరకు 13,395 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1738 మంది మృతి చెందారు. ఇక కడప జిల్లాలో అతి తక్కువ మరణాలు సంభవించాయి. ఇక్క 622 మంది కరోనాతో మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా మృతుల సంఖ్య

కరోనా వల్ల చిత్తూరు నలుగురు, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి ఇద్దరు, ప్రకాశం ఇద్దరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరుగా మరణించారు.

జిల్లాల వారీగా కేసులు

అనంతపురం 59. చిత్తూరు 377. ఈస్ట్ గోదావరి 410. గుంటూరు 231. వైఎస్ఆర్ కడప 125. కృష్ణా 299. కర్నూలు 48. నెల్లూరు 187. ప్రకాశం 185. శ్రీకాకుళం 45. విశాఖపట్టణం 170. విజయనగరం 28. వెస్ట్ గోదావరి 123. మొత్తం : 2,287

Image