AP Government: ఏపీ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏల విడుదలపై ఉత్తర్వులు.. ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (AP Government)ఉద్యోగులు, పింఛనుదారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

AP government released pending DA Allowance for employees and pensioners.

  • జీతాలు, పెన్షన్లు భారీగా పెరుగుతాయి
  • డీఏ బకాయిలు వెంటనే చెల్లింపు
  • ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉద్యోగ వర్గాలకు తీపి కబురు అందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూర్చేలా రెండు కరువు భత్యం (డీఏ) వాయిదాలను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Heavy Rain Alert: బలపడిన అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు!

రెండు డీఏల విడుదల వివరాలు:

ఆర్థిక శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, 2024 జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా 2.73 శాతం డీఏను చెల్లించనున్నారు. దీనితో పాటు, 2025 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా మరో 1.82 శాతం డీఏను మంజూరు చేశారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులు(AP Government), పింఛనుదారుల ఖాతాల్లో నెలానెలా అందే మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపించనుంది.

ఉద్యోగులు, పింఛనుదారులకు ఆర్థిక ఊరట:

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను ఒకేసారి విడుదల చేయడంపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, పింఛనుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ బకాయిలను విడుదల చేయడం వల్ల వేలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించినట్లయింది.