మంటల్లో కాలి బూడిదైన కారు

  • Publish Date - December 8, 2020 / 03:07 PM IST

Car set ablaze in Vijayawada : విజయవాడలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద వశాత్తు కారులో మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బుడిదైంది. ప్రమాదాన్ని పసిగట్టిన కారులోని వారు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు, నిర్మలా నగర్ కు చెందిన వెంకట రెడ్డి అనే వ్యక్తి కుమార్తె శ్రావ్య విజయవాడ సమీపంలోని గూడవల్లి నారాయణ కాలేజీలో ఇంటర్మీడియేట్ 2వ సంవత్సరం చదువుతోంది. కుమార్తెకు కాలేజీ పుస్తకాలు సర్టిఫికెట్లు తీసుకోవటం కోసం ఒంగోలు నుంచి కుటుంబ సభ్యులు ముగ్గరు మంగళవారం కారులో గూడవల్లికి బయలు దేరారు.



మధ్యాహ్నం 2 గంటల సమయంలో విజయవాడ కనకదుర్గవారధి దాటి కృష్ణలంక వద్దకు వచ్చేసరికి కారులోంచి పొగలు రావటం మొదలైంది. అది గమనించిన వెంకట రెడ్డి వెంటనే కారును పక్కకు ఆపగా…. అందరూ కారులోంచి దిగిపోయారు. క్షణాల్లో కారులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు రాగా కారు అగ్నికి ఆహుతయ్యింది. కారులోని వైర్లు షార్ట్ సర్క్యూట్ అవటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


ట్రెండింగ్ వార్తలు