సీఎం జగన్ ఫ్లెక్సీలు ధ్వంసం : రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రైతులు భగ్గుమన్నారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.

  • Publish Date - December 20, 2019 / 01:56 PM IST

అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రైతులు భగ్గుమన్నారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.

అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రైతులు భగ్గుమన్నారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. సచివాలయం ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ వైపు రైతులు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఆందోళనకారులు సీఎం జగన్ ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. 

ఏపీ రాజధాని అంశంపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ.. డిసెంబర్ 20న సీఎం జగన్ కు తుది నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కమిటీ సభ్యులు.. సీఎంకు ఇచ్చిన నివేదికలో చేసిన సూచనలను, సిఫార్సులను మీడియాకు వివరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తాము నివేదికలో సూచించామని కమిటీ సభ్యులు తెలిపారు. విశాఖలో సచివాలయం, సీఎంవో, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్.. కర్నూలులో హైకోర్టు, శీతాకాల అసెంబ్లీ, సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామన్నారు. అంతేకాదు.. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని తాము సిఫార్సు చేసినట్టు కమిటీ సభ్యులు వివరించారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా రాష్ట్రాన్ని విభజించాలని కోరామన్నారు.

సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని సీఎంకు ఇచ్చామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రధానంగా రెండు అంశాలపై (రాజధాని, అభివృద్ధి) తాము అధ్యయనం జరిపామని, మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నామని కమిటీ సభ్యులు వివరించారు. ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. మూడు ప్రాంతాల సమస్యలపై తాము పరిశీలన చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలి, అందుకోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సూచనలు, సిఫార్సులు నివేదికలో పొందుపరిచామని కమిటీ సభ్యులు చెప్పారు.