Perni Nani : టీజేపీగా మారిన బీజేపీ.. వారి మాటలు వింటే ఒక్క సీటు కూడా గెలవరు : పేర్ని నాని
అమరావతి ల్యాండ్ స్కాంపై విచారణ జరిపిస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కర్నూలులో హైకోర్టు పెడతామని మ్యానిఫెస్టో హామీ ఇచ్చారు.. ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
![Perni Nani : టీజేపీగా మారిన బీజేపీ.. వారి మాటలు వింటే ఒక్క సీటు కూడా గెలవరు : పేర్ని నాని Perni Nani : టీజేపీగా మారిన బీజేపీ.. వారి మాటలు వింటే ఒక్క సీటు కూడా గెలవరు : పేర్ని నాని](https://10tv.in/wp-content/uploads/2023/06/Perni-Nani-1.jpg)
Perni Nani
Perni Nani criticized JP Nadda : బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డాపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. మర్యాద మీరితే అట్టుకు రెండట్లు పెట్టాల్సి వస్తుందన్నారు. ‘మనువు బీజేపీతో మనసు చంద్రబాబుతో ఉన్న సీఎం రమేష్, సత్యకుమార్, సుజనా చౌదరి మాటలు నమ్మితే మీ కర్మ’ అని బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మేరకు ఆదివారం తాడేపల్లిలో నాని మీడియాతో మాట్లాడారు. పచ్చ పువ్వుల మాటలు నమ్మి తమపైన విమర్శలు చేస్తారా అని అన్నారు.
అమరావతి ల్యాండ్ స్కాంపై విచారణ జరిపిస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కర్నూలులో హైకోర్టు పెడతామని మ్యానిఫెస్టో హామీ ఇచ్చారు.. ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అమరావతిలో పాపాలు జరుగుతున్నాయి.. చంద్రబాబు డబ్బులు తినేశాడన్న బీజేపీ ఇవాళ అమరావతిని బలపరుస్తున్నామంటున్నారు.. మరి అమరావతికి పాపాల బాధ్యులెవరో చెప్పాలన్నారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీ, బీజేపీ కలిసి ఏపీని ఏలిన మాట వాస్తవమని తెలిపారు.
Jupally Krishna Rao: కాంగ్రెస్ ముఖ్యనేతలతో జూపల్లి వరుస భేటీలు.. పార్టీలో చేరిక ఎప్పుడంటే..?
‘మీ హయాంలో ఇసుక ఫ్రీ అని నదుల్లో ఉన్న ఇసుకను టీడీపీ, బీజేపీ దోచుకుంది అని నడ్డాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో నాలుగేళ్లలో 4 వేల కోట్లు ప్రభుత్వానికి అదాయం వచ్చిందని తెలిపారు. నాలుగు వేల కోట్ల రూపాయలు టీడీపీ, బీజేపీ హయాంలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో నడ్డాకే తెలియాలన్నారు. ‘ఏపీ లిక్కర్ సేల్స్ 80 శాతం అమ్మకాలను టీడీపీ, బీజేపీ ఢిల్లీకి చెందిన నాలుగు కంపెనీలకే ఇచ్చారు.. మా హయాంలో 20 కంపెనీలకు ఇచ్చాం.. ఎవరిది లిక్కర్ స్కాం’ అని ప్రశ్నించారు.
తమ హయాంలోనే లిక్కర్ లో సేల్స్ పెరిగాయని తెలిపారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వ హయాంలో బెల్ట్ దందా… ఇతరత్రా వాటిల్లో ఢిల్లీ వాటా ఎంత, ఏపీ వాటా ఎంతో నడ్డా చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ల్యాండ్ స్కాం జరిగిందన్న నడ్డా ఇవాళ అమరావతిని ఎందుకు సమర్ధిస్తున్నారని ప్రశ్నించారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మేసి భూమి మీద కన్నేశారని విమర్శించారు. విపక్షాల ప్రశ్నలకు నడ్డాకు చేతనైతే ఢిల్లీ నుంచి సమాధానం చెప్తే బావుంటుందన్నారు. బెంగళూరులో అవినీతి ప్రభుత్వం బీజేపీది కాదా అని అన్నారు.
పచ్చ పువ్వులతో నిండిన బీజేపీ కాస్త టీజేపీగా మారిందని ఎద్దేవా చేశారు. పచ్చ పువ్వుల మాటలు వింటే ఏపీలో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదని చెప్పారు. దేశంలో సీబీఐ ఏ పరిస్ధితికి చేరిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈశాన్య, ఉత్తర, మధ్య ప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పై ఏ దారుణాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసని పేర్కొన్నారు. హరీష్ రావుకు ఆయన మామ, బామ్మర్దిపై ఈర్ష ఉందన్నారు. మామ(కేసీఆర్)ను కిందకు దింపి పైన కూర్చోవాలనే తపన హరీష్ రావుకు ఉందన్నారు.
కేసీఆర్ గత ఎన్నికల్లో గెలిచాక హరీష్ రావు ఎక్కడున్నాడు? ఎందుకు పక్కన పెట్టాడు? అని ప్రశ్నించారు. 2018లో కేసీఆర్ మంత్రివర్గంలో హరీష్ రావు ఎందుకు లేరని నిలదీశారు. ‘మా అల్లుడు చేతలెక్కువయ్యాయని కేసీఆరే చెప్పారు’ అని పేర్కొన్నారు. హరీష్ రావు చంద్రబాబును ఫాలో అవుదామని అనుకున్నాడని వెల్లడించారు. ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి చంద్రబాబును నమ్మాడు.. కేసీఆర్ ముదురు కాబట్టి హరీష్ రావును పక్కన పెట్టాడని తెలిపారు.
Andhra Pradesh: జగనన్న విద్యా కానుక.. విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం
తమ ప్రభుత్వానికి హరీష్ రావు సర్టిఫికెట్లు అవసరం లేదు..ఏడ్చేవాళ్లకు ఇవ్వమనండి అని పేర్కొన్నారు. కేసీఆర్ ను తిట్టాలంటే చంద్రబాబుకు భయం ఉందన్నారు. వైసీపీకి భయం లేదు కాబట్టే హరీష్ రావు తమను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. అల్లుడు గిల్లుడు చూస్తుంటే కేసీఆర్ ను తిట్టమని హరీష్ రావు తమ ప్రభుత్వంపై మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. హరీష్ రావు మాటలను ఖండించకుంటే కేసీఆర్ ను కూడా తిడతామని హెచ్చరించారు.