Dastagiri: దస్తగిరికి బెయిల్ మంజూరు చేసిన కడప జిల్లా కోర్టు
Dastagiri: వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో దస్తగిరికి ఇప్పుడు బెయిల్ దక్కింది. దస్తగిరి మంగళవారం..
ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులో దస్తగిరికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి కేసులో దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మూడు నెలలుగా కడప జైల్లో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఎర్రగుంట్ల పోలీసులు పెట్టిన అట్రాసిటీ కేసులో రెండు వారాల కిందటే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో దస్తగిరికి ఇప్పుడు బెయిల్ దక్కింది. దస్తగిరి మంగళవారం సాయంత్రం కడప జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.
కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు దస్తగిరిపై నమోదు చేసిన అపహరణ, ఎట్రాసిటీ కేసుకు సంబంధించి ఇటీవలే హైకోర్టు నుంచి బెయిల్ దక్కింది. ఓ అమ్మాయిని దస్తగిరి కిడ్నాప్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల వేళ దస్తగిరిపై పలు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, అతడిని బయటకు రాకుండా చేస్తున్నారని అతడి తరఫు న్యాయవాది ఆ సందర్భంగా వాదించారు.
Also Read: టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు, మమ్మల్ని ఏమీ చేసేది లేదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు