Minister Narayana: గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను వదిలేసింది: మంత్రి నారాయణ
"చెత్త పన్ను వేయడం తప్ప చెత్తను ఎలా ట్రీట్ చేయాలన్నది గత ప్రభుత్వానికి తెలియదు" అని నారాయణ అన్నారు.

Minister Narayana
పల్నాడు జిల్లాలోని జిందాల్ వేస్ట్ పవర్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి పరిశీలించారు. ప్లాంట్ పనితీరు, ప్లాంట్ కు వస్తున్న వేస్టు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 2014-19 మధ్య చాలా స్టడీ చేసిన తర్వాత వేస్ట్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
“వైసీపీ చెత్త ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను వదిలేసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ నుంచి చెత్తను ఈ ప్లాంట్ కు తరలిస్తున్నారు. 6,890 మెట్రిక్ టన్నుల చెత్తలో 2,500 టన్నుల చెత్తను రెండు ప్లాంట్స్ ద్వారా విద్యుత్ గా మారుస్తున్నారు. కాకినాడ, నెల్లూరులో త్వరలో ప్లాంట్ లు ఏర్పాటు చేస్తాం.
గత ప్రభుత్వం ఒక్క ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయలేదు. చెత్త పన్ను వేయడం తప్ప చెత్తను ఎలా ట్రీట్ చేయాలన్నది గత ప్రభుత్వానికి తెలియదు. చెత్త పన్ను తీసేశాం… చట్ట సవరణ చేసి మరీ చెత్త పన్ను తొలగించాం. అమృత్ పథకానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పథకం కింద ఇచ్చే నిధులు ఉపయోగించలేకపోయాం. టన్ను చెత్తను ట్రీట్ చేయాలంటే 500 నుంచి 750 రూపాయలు ఖర్చవుతుంది. ఆ ఖర్చు తగ్గించాలంటే చెత్త తరలించడమే మార్గం” అని అన్నారు.
రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: అంబటి రాంబాబు