Nadendla Manohar: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పొత్తులపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని తెలిపారు. ఆ బాధ్యతను తీసుకుంటామని, జనసేన తరఫున సహకారం అందిస్తామని అన్నారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నామని అన్నారు.
వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కాబోతున్నామనే విషయంపై ప్రజలకు పారదర్శకంగా తెలియజేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరుతో మభ్యపెట్టిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ ప్రణాళికలు వేసుకుంటున్న విషయం తెలిసిందే.
వారాహి పేరుతో వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. గత ఏపీ ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకుని ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ పర్యటిస్తారని ప్రచారం జరుగుతోంది. కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిద్దామని తెలంగాణలోని తమ కార్యకర్తలకు పవన్ కల్యాణ్ ఇటీవలే తెలిపారు.
Srivari Arjita Seva Tickets : నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల