చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై కేసు నమోదు
చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశం నిర్వహించవద్దని పోలీసులు చెప్పడంతో.. ఆమంచి వారితో గొడవకు దిగారు. దీంతో.. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఆమంచిపై పోలీసులు కేసు పెట్టారు.